'రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి' | Sakshi
Sakshi News home page

'రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి'

Published Tue, Sep 23 2014 5:17 PM

'రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి'

హైదరాబాద్:రుణమాఫీ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీపై మరోసారి మాట తప్పిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. రుణమాఫీపై మంగళవారం మీడియాతో మాట్లాడిన డీకే అరుణ.. రైతు రుణాల్లో 25 శాతం మాఫీ చేస్తామంటున్న ప్రభుత్వం.. మిగిలిన 75 శాతాన్ని ఎప్పుడు మాఫీ చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

అసలు మిగిలిన రుణాల వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందా?లేక రైతులే చెల్లించాలా? అనే దానిపై వివరణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం రుణాలు చెల్లించకపోతే.. రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వని వాస్తవాన్ని ప్రభుత్వం గ్రహించాలన్నారు.

Advertisement
Advertisement