సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వే మార్గంలో రాయి విసిరిన ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలి ప్రాణాలు పోవడానికి కారుడైన నిందితున్ని సిమ్ కార్డు ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజుల కిందట రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన దర్శనా పవార్ (29) అనే మహిళ సీఎస్టీలో లోకల్ రైలు ఎక్కింది. రద్దీ కారణంగా డోరు దగ్గర నిలబడింది. రైలు అంబర్నాథ్ స్టేషన్ దాటిన తరువాత ఓ ఆగంతకుడు విసిరిన రాయి ఆమె ముఖానికి తగలడంతో కిందపడింది.
తోటి ప్రయాణికులు కల్యాణ్ స్టేషన్లో రైల్వే పోలీసులకు ఫిర్యాదుచేసి మరో రైలులో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కాగా, కల్యాణ్ నుంచి వచ్చిన రైల్వే కానిస్టేబుల్ నిబంధన ప్రకారం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాలని పట్టుబట్టాడు. చివరకు ముంబైలోని కేం ఆస్పత్రికి తరలించారు. కాని ఆలస్యం కారణంగా ఆమె మరణించిన సంగతి తెలిసిందే. కాగా సంఘటన స్థలంవద్ద ఆమె ఒంటిపై నగలు, బ్యాగులో సెల్ఫోన్, ఇతర విలువైన వస్తువులు కనిపించలేదు. దీంతో చోరీ కోసం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానించారు.
రంగంలోకి దిగిన పోలీసులు దర్శనా సిమ్ కార్డు ఆధారంగా ఫోన్ నాసిక్లోని వర్ణి గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. గ్రామంలో ఫోన్ వినియోగిస్తున్న రతన్ మర్వాడి అనే యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. గతంలో ఇలాగే విరార్ పరిసరాల్లో రాయి విసిరి ఓ ప్రయాణికున్ని కిందపడగొట్టాడు. అతన్ని దోచుకున్నందుకు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు పోలీసులు వెల్లడించారు.
సిమ్ కార్డు ఆధారంగా నిందితుడి అరెస్టు
Published Wed, Feb 25 2015 11:00 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
స్టేషన్కు పిలిచి చిత్రహింసలు పెడుతున్నారు
ఏజెన్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి
కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది
భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాలి
జాతీయ లోక్ అదాలత్కు సహకరించాలి
‘బెల్టు’ జోరు..
ఘనంగా హేమాచలుడి రథోత్సవం
కేన్స్ 2024: బాలీవుడ్ హీరోయిన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా!
డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
నేటి నుంచి 144 సెక్షన్
తప్పక చదవండి
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- ఆయా బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
- అది నిరూపిస్తే రేపే రాజీనామా చేస్తా: కేటీఆర్ సవాల్
- సెల్యూట్ కొట్టలేదని.. నెలరోజుల జీతం కోత
- కేన్స్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్
- మంత్రి ఉత్తమ్ కుమార్పై నమ్మకముంది: బండి సంజయ్
- ఈవీఎం ట్యాంపరింగ్పై స్పందించిన ఈసీ
- ఛత్తీస్గఢ్ ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
- SRH vs RR: ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?: టీమిండియా దిగ్గజం ఫైర్
Advertisement