సుప్రీం చీఫ్ జస్టిస్ను కలిసిన హైకోర్టు సీజే | Sakshi
Sakshi News home page

సుప్రీం చీఫ్ జస్టిస్ను కలిసిన హైకోర్టు సీజే

Published Sat, Oct 25 2014 11:21 AM

Kalyan jyoti sengupta met supreme court cheif justice

న్యూఢిల్లీ :  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తును హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటుచేసే విషయంపై హెచ్ ఎల్ దత్తుతో చర్చించినట్లు సమాచారం. 

అలాగే హైకోర్టు విభజనకు  సంబంధించి భవనాల కేటాయింపు, న్యాయమూర్తుల లభ్యత, సిబ్బంది విభజన తదితర వివరాలన్నింటిపై సీజేఐకి కల్యాణ్‌ జ్యోతిసేన్‌ గుప్తా వివరించినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ  సీఎం కేసీఆర్ ఇటీవలే  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌లను ప్రత్యేక హైకోర్టు గురించి  కలసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement