బెంగళూరు : బెంగళూరు వైట్ఫీల్డ్ ఏరియాలోని కాడ్గోడి పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని ఇంటర్ విద్యార్థినిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల సంఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందగా మరో విద్యార్థిని కూడా తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళితే ప్రగతి రెసిడెన్షియల్ కళాశాలలో చదువుతున్న గౌతమి అదే కాలేజీ హాస్టల్లో ఉంటోంది. కాగా అదే కళాశాలలో ఆఫీస్ బాయి్ గా పని చేస్తున్న మహేష్ గత కొంతకాలంగా గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే ఆమె నిరాకరించటంతో అతడు కక్ష గట్టాడు.
గత రాత్రి 11.30 గంటల సమయంలో మహేష్ ...హాస్టల్కు వెళ్లి గౌతమితో ప్రేమ విషయంలో వాగ్వివాదానికి దిగాడు. అయితే ఆమె నిరాకరించటంతో కోపం పట్టలేని అతడు సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఉండే గన్తో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో గౌతమి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థిని శిరీష గాయపడింది. శిరీషను చికిత్స నిమిత్తం వైదేహీ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం పరారీలో ఉన్న మహేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలు గౌతమి స్వస్థలం అనంతపురం జిల్లా పావుగడ. ఆమె కుటుంబ సభ్యులకు కళాశాల యాజమాన్యం సమాచారం ఇచ్చింది. మరోవైపు శిరీష పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక హోం మంత్రి కేజే జార్జ్, సిటీ పోలీస్ చీఫ్ ఎంఎన్ రెడ్డి, సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ప్రేమించలేదని తుపాకీతో కాల్చేశాడు..
Published Wed, Apr 1 2015 11:14 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement