లోయలో పడిన బస్సు.. 20 మంది మృతి | Sakshi
Sakshi News home page

లోయలో పడిన బస్సు.. 20 మంది మృతి

Published Tue, Jul 29 2014 6:29 PM

20 killed in Himachal bus accident

షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో మరో విషాదకర సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర రవాణ సంస్థకు చెందిన బస్సు అదుపు తప్పి పర్వత ప్రాంతం నుంచి 400 అడుగుల లోతు లోయలోకి పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో కనీసం 20 మంది ప్రయాణికులు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

మంగళవారం బస్సు షిమ్లా నుంచి సవేరా ఖడ్ వెళ్తుండగా కేదార్ ఘాట్ సమీపంలో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. లోయలోపడిన వారిలో కొన్ని మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంలో జరిగిన ప్రాంతంలో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండంతో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి.

Advertisement
Advertisement