షికారుకెళితే ఏం జరిగింది? | Sakshi
Sakshi News home page

షికారుకెళితే ఏం జరిగింది?

Published Sun, Aug 28 2016 1:09 AM

షికారుకెళితే  ఏం జరిగింది?

‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీ దాన.. బుగ్గమీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా’ అంటూ ‘తోడి కోడళ్ళు’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాడిన పాట ఎవర్‌గ్రీన్ హిట్. ఇప్పుడా ప్రస్తావన ఎందుకు? అంటే, ‘కారులో షికారుకెళితే’ పేరుతో తాజాగా ఓ చిత్రం తెరకెక్కింది. ధీరూ మహేశ్, సుదర్శన్ కళాధర్, సురేశ్, ఇషికా సింగ్, ప్రియ ప్రధాన పాత్రల్లో మాదాల కోటేశ్వరరావు దర్శకత్వంలో మధు, అనీష్, అభిరాం నిర్మించారు.
 
 ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను నటుడు మాదాల రవి, టీజర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఫ్రెండ్స్ అంతా కలిిసి కారులో షికారుకెళితే ఏం జరిగింది? అన్నది కథాంశం. ఇందులో ఉన్న సన్నివేశాలు ఉత్కంఠకు గురి చేస్తాయి. సెప్టెంబరులో పాటలు, సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.
 

Advertisement
Advertisement