త్వరలో సెట్స్ మీదకు సై..రా..!

త్వరలో సెట్స్ మీదకు సై..రా..!


మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ హిస్టారికల్ మూవీ సై రా నరసింహారెడ్డి. తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పలువురు పరభాష నటులు నటించనున్నారు.



సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక నిపుణులుగా గుర్తింపు తెచ్చుకున్న వారు  పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 5 నుంచి మొదలు కానుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజస్థాన్, పొల్లాచ్చి ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. ఆ పనులు పూర్తయ్యాక షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top