ప్రారంభమైన తెలంగాణ ఎడ్ సెట్ | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన తెలంగాణ ఎడ్ సెట్

Published Fri, May 27 2016 11:13 AM

Telangana Edcet begin

హైదరాబాద్ : తెలంగాణ ఎడ్‌సెట్-2016 రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైంది. అత్యధికంగా హైదరాబాద్ నుంచి 12 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తుండగా.. వీరికోసం 25 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. కాగా తొలిసారిగా ఎడ్ సెట్కు హాజరయ్యే అభ్యర్థుల నుంచి వేలిముద్రలు (బయోమెట్రిక్) సేకరించారు.

ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా ఈ పరీక్ష నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు  కన్వీనర్ పి. ప్రసాద్ వివరించారు.  రాష్ట్రంలోని మొత్తం 14 నగరాలు, పట్టణాల్లో కలపి 109 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెథడాలజీలకు సంబంధించి 45,500 మంది అభ్యర్థులు ఎడ్సెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, సాంఘిక శాస్త్రం మెథడాలజీకి అధిక సంఖ్యలో అందాయి.

Advertisement
Advertisement