నకిరేకల్ : రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలో 3.8కోట్లతో నిమ్మ మార్కెట్కు, రూ. 3.7కోట్లతో మినీ ట్యాంక్ నిర్మాణ పనులకు స్థానిక పెద్ద చెరువు వద్ద సోమవారం మంత్రి జగదీశ్రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. స్థానిక మెయిన్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. అందరికంటే ముఖ్యంగా రైతన్న బాగుండాలనదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల సంక్షేమం కోసం బడ్జెట్లో 45శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు.
రూ.25వేల కోట్ల నిధులతో రైతుల కోసం ఊరూరా మిషన్ కాకతీయ కింద చెరువుల బాగు కోసం ఖర్చుచేశామన్నారు. ఒకప్పుడు చెరువు మీదకు వెళ్తే సర్కారు, తుమ్మ చెట్లు తప్ప మరేవి కనపడేవి కావు. గత పాలకులు చెరువుల బాగు గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం హయూంలో గ్రామంలోని చెరువులు నీటితో నిండుగాా కళకళలాడుతూ ఊరికి జీవనోపాధిగా నిలిచాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాబోయే యాసంగి పంటలలో రైతులకు 9గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తామన్నారు.
ఒక్క చుక్క మూసీ నీటిని కూడా కృష్ణాలోకి పోనివ్వం..
ఈ జిల్లాలకు హరితహారంలో సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు రూ.285 కోట్లను మూసీ ఆధునీకరణ కోసం అడగగానే వెంటనే నిధులు మంజూరు చేశామని, త్వరలో టెండర్లు పిలిపించి ఈ ఎండాకాలంలోనే మూసీ కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టి ఒక్కచుక్క మూసీ నీటిని కృష్ణానదిలోకి పోనివ్వకుండా కృషి చేస్తామన్నారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా త్వరలోనే టెండర్లు వేసి అతిత్వరలోనే పనులు ప్రారంభించి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే ప్రయత్నం తమ ప్రభుత్వం చేయబోతుందన్నారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, అటవీశాఖ రాష్ట్ర చైర్మన్ బండ నరేందర్రెడ్డి, జెడ్పీచైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ పూలరవీందర్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, నకిరేకల్, శాలిగౌరారం మండలాల జెడ్పీటీసీలు పెండెం ధనలక్ష్మి సదానందం, ఐతగోని సునిత, ఎంపీపీలు రేగట్టె మల్లికార్జున్రెడ్డి, లింగస్వామి, నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, సుంకరి మల్లేష్గౌడ్, పూజర్ల శంభయ్య, సోమ యాదగిరి, వీర్లపాటి రమేష్, వివిధ మండలాల మండల శాఖ అధ్యక్షులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, వెంకట్రెడ్డి, రహీంఖాన్, రాములు, వెంకన్న, శ్రీనివాస్ ఉన్నారు.
రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండా
Published Tue, Oct 25 2016 1:19 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement