యాదాద్రిలో వర్ష బీభత్సం | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో వర్ష బీభత్సం

Published Mon, May 2 2016 11:20 PM

heavy rain in Yadagirigutta piligrim

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి కురిసిన వర్షం భక్తులను ఆందోళనకు గురిచేసింది. బాల ఆలయంలోకి నీరు ప్రవేశించి నిత్య కైంకర్యాలకు కొద్దిసేపు ఆటంకం కలిగింది. కొండపైన ఉన్న దుకాణాల డేరాలు కూలిపోయాయి. ప్రసాద విక్రయ శాలలోని ప్రసాదాలు వర్షానికి తడిసి పోయాయి. వెంటనే దేవస్థానం అధికారులు ప్రసాదాలను గోదాంలోకి మార్చారు.

చలువ పందిళ్లు కూలి కొంత మంది భక్తులకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారిని వెంటనే స్థానికంగా ఉన్న ప్రై వేటు ఆసుపత్రికి తరలించారన్నారు. ఆలయ పరిసరాలన్నీ నీటితో నిండిపోవడంతో భక్తులు కూర్చోవడానికి వీలులేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఘాట్‌రోడ్డు పై వర్షానికి పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు కూలి వాహన దారులకు ఇబ్బంది కలిగించింది.

Advertisement
Advertisement