హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు కెప్టన్ మహేందర్ సింగ్ ధోని వీరాభిమాని పీరం చెరువుకు చెందిన కిరణ్ శుక్రవారం ధోనిని కలిసేందుకు సైకిల్పై రాంచీకి పయనమయ్యారు. సైకిల్ యాత్రను గ్రామ నాయకుడు నాగరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ధోని సాధించిన పరుగులు, శతకాలు, రికార్డులపై పుస్తకాన్ని రాశానన్నారు. 25 రోజుల పాటు సైకిల్పై రాంచీకి వెళ్లి ధోనిచే పుస్తకాన్ని ఆవిష్కరిస్తామన్నారు.