-
‘ధోనికి రుణపడి ఉంటా’అశ్విన్ భావోద్వేగం
చెన్నై: దాదాపు 13 ఏళ్ల క్రితం తనకంటూ ఎలాంటి గుర్తింపు లేని రోజుల్లో అండగా నిలిచి అవకాశాలు కల్పించిన మహేంద్ర సింగ్ ధోనికి తాను జీవితకాలం రుణపడి ఉంటానని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. 100 టెస్టులు పూర్తి చేసుకోవడంతో పాటు 500 వికెట్ల మైలురాయిని దాటిన అశ్విన్ను శనివారం తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ) ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా తన కెరీర్ను మలుపు తిప్పిన 2011 ఐపీఎల్ ఫైనల్ను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. ‘కొత్త బంతితో నన్ను క్రిస్ గేల్కు బౌలింగ్ చేసే అవకాశాన్ని ధోని కల్పించాడు. నాలుగో బంతికే నేను వికెట్ తీయగలిగా. ఇప్పటికీ చాలా మంది దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే అందుకు ధోనినే కారణం. అతనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. సాధారణంగా నేను మాట్లాడేప్పుడు పదాల కోసం ఎప్పుడూ తడబడను. కానీ ఈ రోజు నా పరిస్థితి భిన్నంగా ఉంది. టీఎన్సీఏ నాకు ఎంతో గౌరవం కల్పించింది కాబట్టే ఎప్పుడైనా క్లబ్ క్రికెట్ కూడా సిద్ధంగా ఉంటా. నేను రేపు చచ్చిపోయినా నా ఆత్మ ఈ స్టేడియంలోనే తిరుగుతూ ఉంటుంది’ అని అశ్విన్ అన్నాడు. ఈ సన్మాన కార్యక్రమంలో అశ్విన్కు ప్రత్యేక జ్ఞాపికగా ‘సెంగోల్’ అందించడం, అతని పేరిట స్టాంప్ విడుదలతో పాటు రూ. 1 కోటి నగదు పురస్కారాన్ని కూడా అందించారు. -
ధోని జెర్సీ నంబర్ ‘7’కు రిటైర్మెంట్: బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, రెండు ప్రపంచకప్లను గెలిపించిన సారథి మహేంద్ర సింగ్ ధోనిపై బీసీసీఐ సముచిత గౌరవం ప్రదర్శించింది. అతను మైదానంలో ధరించిన ‘7’ నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దిగ్గజ క్రికెటర్గా భారత క్రికెట్కు ధోని చేసిన సేవలకు గుర్తిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీని ప్రకారం ఇకపై భారత క్రికెట్కు ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడు కూడా తమ జెర్సీపై ‘7’ నంబర్ వాడేందుకు బోర్డు అనుమతించదు. గతంలో ఆల్టైమ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ గౌరవార్ధం కూడా అతను ధరించిన ‘10’ నంబర్కు కూడా బీసీసీఐ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ తప్పుకున్న తర్వాత ఒకే ఒకసారి ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ‘10’ నంబర్ జెర్సీని వేసుకోగా అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. దాంతో అతను తన నంబర్ను మార్చుకోవాల్సి వచ్చింది. జెర్సీ నంబర్లకు రిటైర్మెంట్ ప్రకటించడం ఇతర క్రీడల్లో చాలా కాలంగా ఉంది. బాస్కెట్బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వేసుకున్న ‘23’ నంబర్ను కూడా అతని కెరీర్ తర్వాత చికాగో బుల్స్ టీమ్ రిటైర్మెంట్ ఇచ్చింది. -
‘ధోని నుంచి నేర్చుకున్నాను’
విశాఖపట్నం: ఆ్రస్టేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత జట్టు విజయంలో రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. చివర్లో దూకుడుగా ఆడాల్సిన స్థితిలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా నిలబడి అతను ఫినిషర్గా మ్యాచ్ పూర్తి చేశాడు. ఈ లక్షణాన్ని తాను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి నేర్చుకున్నట్లు రింకూ సింగ్ చెప్పాడు. ‘నేను ఇంత ప్రశాంతంగా ఉండగలిగానంటే అందుకు ప్రత్యేక కారణం ఉంది. ఇలాంటి స్థితిలో ఎలా ఆడాలని నేను మహి భాయ్ (ధోని)తో మాట్లాడాను. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఒత్తిడికి లోను కాకపోవడానికి ఆయన ఇచ్చిన సూచనలే కారణం. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండటంతో పాటు నేరుగా బౌలర్పైనే పూర్తి దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు’ అని రింకూ సింగ్ వెల్లడించాడు. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా రింకూ ఆత్మవిశ్వాసంతో దానిని చక్కటి సిక్సర్గా మలిచాడు. అయితే అబాట్ వేసిన ఆ బంతి నోబాల్ కావడంతో సిక్స్ లెక్కలోకి రాలేదు. ‘డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాక అక్షర్ చెప్పే వరకు ఈ విషయం నాకు తెలీదు. అయితే సిక్స్ కాలేకపోవడం పెద్ద అంశం కాదు. మ్యాచ్ గెలవడమే మనకు ముఖ్యం. అది జరిగింది చాలు’ అని రింకూ సింగ్ వ్యాఖ్యానించాడు. -
MS Dhoni Rare Photos: మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
ధోని నిర్మాతగా ‘LGM’, త్వరలో రిలీజ్..
ఇండియన్ క్రికెట్ చరిత్రలో సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు గడించిన మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై LGM సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాక్షి ధోని నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే ట్రైలర్, ఆడియో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోని, సాక్షి ధోని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రమేష్ తమిళ్ మణి మాట్లాడుతూ ‘‘కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా నవ్విస్తూనే ప్రేక్షకుల గుండెలను తాకుతుంది. LGM చిత్రానికి ప్రేక్షకులు తమ ప్రేమ, ఆదరణను అందిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు. ఇటీవల విడుదలైన LGM టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. డిజిటల్ ఫ్లాట్ఫామ్లో 7 మిలియన్స్కు పైగా వ్యూస్ను సాధించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న LGM చిత్రానికి రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించటంతో పాటు మ్యూజిక్ను కూడా అందించారు. యోగి బాబు, మిర్చి విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. చదవండి: సమంత రేంజే వేరు.. సిటాడెల్ కోసం ఎంత పారితోషికం తీసుకుందంటే?
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement