రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు

Published Sun, Jan 22 2017 11:47 PM

couple injured of road accident

గుత్తిరూరల్‌ (గుంతకల్లు) : గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామ శివార్లలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఆటో ఢీ కొన్న ప్రమాదంలో గుత్తికి చెందిన అత్తార్‌బాషా, మహబూబ్బీ అనే దంపతులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి కారణమైన ఆటో ఆపకుండా వెళ్లిపోతుండటంతో వెనక వస్తున్న పోలీసులు వెంబడించి ఆటోను పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement