31 నుంచి ఏపీ లాసెట్‌ కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

31 నుంచి ఏపీ లాసెట్‌ కౌన్సెలింగ్‌

Published Sun, Oct 23 2016 10:54 PM

ap lawcet on 31st to

ఎస్కేయూ(అనంతపురం) : ఎల్‌ఎల్‌బీ (మూడు / ఐదు సంవత్సరాలు కోర్సు), ఎల్‌ఎల్‌ఎం కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్‌ను ఈ నెల 31 నుంచి నిర్వహిస్తున్నట్లు ఏపీ లాసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎస్వీ పుల్లారెడ్డి తెలిపారు. నవంబర్‌ 3 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు.

అనంతపురం, గుంటూరు, తిరుపతి , విశాఖపట్టణంలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు.  నవంబర్‌ 1 నుంచి 5 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వవచ్చనీ. 6న సీట్లు కేటాయింపు జరుగుతుందన్నారు. నవంబర్‌ 10 నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌ నవంబర్‌ 13, 14 తేదీల్లో నిర్వహిస్తామన్నారు.

Advertisement
Advertisement