మూడేళ్లుగా కరువే కరువు | Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా కరువే కరువు

Published Sun, Jan 8 2017 3:25 PM

ys jagan mohan reddy slams chandra babu over farmers issue

చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మూడేళ్లుగా కరువే కరువని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా లింగాపురంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 
  • రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, రైతులు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది
  • రైతు బాగుంటే రైతు కూలీలకు కూడా పనులు దొరుకుతాయి, గ్రామీణ వ్యవస్థ పరిగెత్తే పరిస్థితి వస్తుంది
  • చంద్రబాబు పాలనలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోంది
  • ఈ మూడేళ్లలో మనకు ఏం మేలు జరిగిందని చంద్రబాబును ప్రశ్నించమని అడుగుతున్నా
  • ఆయనవల్ల మేలు జరగకపోగా వరుసగా ఇప్పటికి మూడేళ్లు కరువే కరువు
  • చంద్రబాబు సీఎం అవ్వడం కోసం ఆ రోజుల్లో.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అనేవారు
  • రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అనేవారు
  • రైతులను వదల్లేదు, ఆడవాళ్లని కూడా చూడకుండా డ్వాక్రా అక్కచెల్లెళ్లనూ వదల్లేదు
  • ఏ గోడమీద రాతలు చూసినా, ఏ టీవీ ఆన్ చేసినా.. డ్వాక్రా సంఘాలను తానే కనిపెట్టానని చెప్పేవారు
  • డ్వాక్రా సంఘాల అప్పులన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేవారు
  • రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు చివరకు చదువుకుంటున్న పిల్లలను సైతం వదల్లేదు
  • జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు
  • చివరకు బాబు ముఖ్యమంత్రి అయ్యారు
  • రైతులు, డ్వాక్రా అక్క చెల్లెళ్లను, చదువుకున్న పిల్లలను మోసం చేశారు
  • చంద్రబాబు సీఎం అయ్యి 32 నెలలైంది.. ఆయన నాకు 64వేలు బాకీ అని ఓ యువకుడు అడిగారు
  • తాను ఎవరికి చెప్పుకోవాలని అడిగాడు

  • కనీసం ఆ పిల్లాడు మాట్లాడిన మాటలకైనా చంద్రబాబుకు కాస్తో కూస్తో జ్ఞానోదయం అవుతుందేమో, బుద్ధి, సిగ్గు ఏమాత్రమైనా వస్తాయేమోనని ఆశగా ఎదురుచూశాం
  • రబీ పంటలు వేశాం. కానీ రైతులు బ్యాంకుల గడప తొక్కలేకపోతున్నారు
  • పంట రుణాలు 24వేల కోట్లు, టెర్మ లోన్స్ మరో 9800 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే, రబీ పంటకు చంద్రబాబు పుణ్యమాని కేవలం 4900 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు
  • మరి ఈ ముఖ్యమంత్రి బ్యాంకులను నిలదీయాల్సింది పోయి, క్యాబినెట్ మీటింగులో రైతుల గురించి మాట్లాడలేదు
  • బయటకొచ్చాక బ్యాంకులిచ్చింది సంతృప్తికరంగా ఉందని చెప్పారు
  • ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయడానికి అర్హుడా అని అడుగుతున్నా
  • రైతులు ఉల్లిపంట వేసి.. కిలో 2 రూపాయలు కూడా గిట్టక పొలంలోనే వదిలేశారు
  • గిట్టుబాటు ధర కోసం రైతులు ధర్నా చేస్తుంటే వాళ్లమీద పోలీసు కేసులు పెట్టిస్తున్నారు
  • ఉల్లి, టమోటా, మిర్చి, చివరకు ధాన్యం పరిస్థితి కూడా అంతే
  • కర్నూలు సోనా అనేది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ధాన్యం
  • కానీ ఆ ధాన్యం బస్తా 1250-1300 కూడా కొనే నాథుడు దొరకడం లేదు

  • ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రావడం లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి
  • రైతులు అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం రైతులను చూసి వెటకారం చేస్తాడు
  • రాష్ట్రం జీడీపీ గ్రోత్‌రేటులో దేశం కన్నా ముందు పరిగెడుతోందని చెబుతారు
  • ఈ పాలనను సాగనంపేందుకు మీ అందరూ చేయి చేయి కలపాలి
  • అడుగులో అడుగు వేయాలి.. చంద్రబాబు లాంటి మోసకారులు, అబద్ధాలు ఆడేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి వస్తుందని అర్థం కావాలి
  • అంతవరకు మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నా    

           

Advertisement
Advertisement