గేదెను ఢీకొని యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

గేదెను ఢీకొని యువకుడి మృతి

Published Sun, Aug 30 2015 10:15 AM

Youth dies in freak accident

పులివెందుల (వైఎస్సార్ జిల్లా) : ఓ యువకుడు బైక్‌పై వేగంగా వెళ్తూ రోడ్డుపై అడ్డు వచ్చిన గేదెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణం కేంద్రంలో వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. వేముల మండలానికి చెందిన గౌస్ ఫీరా(23) పులివెందుల నుంచి బైక్‌పై శనివారం అర్ధరాత్రి వేముల వెళ్తున్నాడు.

కాగా పట్టణంలోని విజయ హోమ్స్ రింగ్‌ రోడ్డు వద్ద గౌస్ బైక్‌తో గేదేను ఢీ కొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గౌస్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అయితే బైక్ వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన గేదె కూడా అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

Advertisement
Advertisement