అక్కడి టీచర్లకు బదిలీలు ఉండవు
విద్యాశాఖ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలు
2013 బదిలీ ఉత్తర్వులు అమలు చేయని వైనం
బదిలీ కోసం 434 మంది ఎదురు చూపు
తాజా బదిలీలకు అడ్డంకి..
అధికారుల తీరుపై ఉపాధ్యాయుల ఆగ్రహం
చిత్తూరు : ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం ఉపాధ్యాయులకు శాపంగా మారింది. కుప్పం నుంచి బదిలీపై వెళ్లేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ససేమిరా అంటుండడంతో బదిలీలు లేక వందలాది మంది ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. 2013 ఏడాదిలో బదిలీ ఉత్తర్వులు అందుకున్నా రిలీవర్స్ రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 434 మంది ఉపాధ్యాయుల బదిలీలు నిలిచి పోయాయి. అయితే తాజా బదిలీలకు ఇది అడ్డంకిగా మారింది. 2013 బదిలీలను అమలు చేసిన తరువాతనే కొత్త బదిలీలు చేయాల్సి ఉంది. 2013లో జిలా వ్యాప్తంగా 434 మంది ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో సెకెండరీ గ్రేడ్ వారితో పాటు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గం నుంచే 204 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్నా సబ్స్ట్యూట్లు రాకపోవడంతో బదిలీ అయిన ఉపాధ్యాయులు రిలీవ్ కాలేదు.
కుప్పంలో ఉన్న ఉపాధ్యాయులు బదిలీపై వెళితే తిరిగి వారి స్థానాలకు ఉపాధ్యాయులు వె ళ్లే పరిస్థితి లేదని తెలుసుకున్న ఉన్నతాధికారులు వారికి రిలీవ్ అయ్యే అవకాశం లేకుండా చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బదిలీల తంతు సాగినా కుప్పంతో పాటు చిత్తూరు జిల్లాలో అప్పట్లో బదిలీలను నిలిపివేశారు. మూడేళ్లు గడుస్తున్నా వారు రిలీవ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. కుప్పం అటు కర్నాటక, ఇటు తమిళనాడు సరిహద్దులోనూ... చిత్తూరు, తిరుపతికి దూరంగా ఉంది. దీంతో వివిధ శాఖల ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులకు సైతం తిప్పలు తప్పడంలేదు. వసతుల లేమితో పాటు పిల్లల చదువుల ఇబ్బందుల దృష్ట్యా కుప్పంలో నివాసం ఉండేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడంలేదు. చాలా మంది తిరుపతి,చిత్తూరులో కాపురం ఉంటున్నారు. కుప్పం ప్రాంతానికి బదిలీపై వెళ్లేందుకు ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఉన్నతాధికారులు అంగీకరించడంలేదు.
వెళ్లిన ఉద్యోగులు గడువు అనంతరం తిరిగి బదిలీ చేయించుకుని వచ్చేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. అధికారిక ఉత్తర్వులు లేకపోయినా అనధికార ఉత్తర్వులతో ఉపాధ్యాయులతోపాటు వివిధ శాఖల ఉద్యోగులను సైతం భయపెడుతున్నారు. ఒక్క కుప్పంలోనే 204 మంది ఉపాధ్యాయుల బదిలీలు ఆగాయి. కుప్పం నియోజకవర్గం అన్ని శాఖల అధికారులకు శాపంగా మారిందని ఉపాధ్యాయులతోపాటు వివిధ శాఖల అధికారులు వాపోతున్నారు. తాజాగా ముందు మా సంగతి తేల్చమంటూ 434 మంది ఉపాధ్యాయులు అధికారులను నిలదీస్తున్నారు.
కుప్పం.. శాపం.!
Published Mon, Sep 14 2015 2:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement