నేడు గుంటూరు నేతలతో జగన్ భేటీ

నేడు గుంటూరు నేతలతో జగన్ భేటీ - Sakshi


21న విశాఖ జిల్లా నేతలతో సమావేశం




సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19న(బుధవారం) గుంటూరు, 21న(శుక్రవారం) విశాఖపట్టణం జిల్లాల నేతలతో సమావేశమవ్వనున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం లోటస్‌పాండ్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. అలాగే త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై ఈ నెల 22న పార్టీ ఎంపీలతో జగన్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 24, 25 తేదీల్లో ఒంగోలులో ప్రకాశం జిల్లా పార్టీ సమీక్షా సమావేశాలు జరుగుతాయి. జగన్ ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top