యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Published Fri, Feb 5 2016 4:54 PM

the Young man commits suicide

వ్యవసాయ క్షేత్రంలో గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామ శివారులో శుక్రవారం వెలుగుచూసింది. బావి వద్ద పని చేసుకోవడానికి వెళ్లిన రైతులు చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement