రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్రగాయాలు.. | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్రగాయాలు..

Published Sun, Nov 29 2015 3:57 PM

The husband and wife  seriously injured  in a accident

అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భార్యా భర్తలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్ జిల్లా రాజుపాలెంకు చెందిన భార్యాభర్తలు ఓబుల్ రెడ్డి(35) హుస్సేనమ్మ(32) తమ ఎనిమిదేళ్ల కూతురితో కలిసి నందవరం చౌడేశ్వరి అమ్మవారి దర్శనానికి బైక్ వెళ్తున్నారు.

ఈ క్రమంలో నందవరం పండ్లాపురం గ్రామల మధ్యకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం ఢీకొట్టింది. దీంతో భార్యా భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement