నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ గొంతులో పచ్చివెలక్కాయి పడినట్లు అయింది. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అని ఆ పార్టీ నాయకులు తలలుపట్టుకుని కూర్చున్నారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలు కైవసం చేసుకోగా టీడీపీ 15 జడ్పీటీలసు సొంతం చేసుకుంది. 'ఆపరేషన్ ఆకర్ష్' ద్వారా వైఎస్ఆర్ సీపీ చెందిన 9 మంది జడ్పీటీసీలను టీడీపీ ఆకర్షించింది. దాంతో ఇరు పార్టీలకు సమంగా జడ్పీటీసీలుగా వచ్చారు. ఏలాగైన జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ నాయకులు సమాలోచనలు చేశారు. అందులోభాగంగా ఒకరిద్దరు వైఎస్ఆర్ జడ్పీటీసీలను ఆకర్షించాలని వ్యూహారచన చేశారు.
అందుకోసం ఎన్నికలను వాయిదా వేయాలని నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ కలెక్టర్ ఎదుట హల్చల్ చేశారు. దాంతో ఎన్నికల మరో వారానికి వాయిదా పడింది. జడ్పీ ఛైర్మన్ ఎన్నిక సజావుగా సాగేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని జిల్లాకు చెందిన న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఎన్నిక మొత్తాన్ని విడియో తీయాలని , ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని ఆదేశించింది. ప్రత్యేక పరిశీలకుడి ఆధ్వర్యంలో జడ్పీ ఛైర్మన్ ఎన్నిక కూడా పచ్చ తమ్ముళ్లు రసాభాసగా మార్చేశారు. జడ్పీ ఛైర్మన్ ఎన్నికలను మరో సారి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో జడ్పీ ఛైర్మన్ ఎన్నికలను ముచ్చటగా మూడో సారి నిర్వహించారు.
ఈ ఎన్నికల్లోనూ ఇరు పార్టీలకూ సమానంగా ఓట్లు ఉండటంతో జడ్పీ ఛైర్మన్ పదవికి లాటరీ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఆ ఎన్నికల్లో జడ్పీ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ పదవులు వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీ సభ్యులు బి.రాఘవేంద్రారెడ్డి,పి.శిరీష వరించాయి. జడ్పీ ఛైర్మన్ పీఠం కోసం ఒకటా రెండా... ఎన్నో చేశాం... ఇంకెన్నో చేయాలనుకున్నాం. కానీ అదృష్టం మాత్రం తమకు దక్కకుండా పోయిందని పచ్చ తమ్ముళ్లు లోలోన కుమిలిపోతున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీకి కడప జడ్పీ పీఠం తప్ప మరోకటి దక్కకూడదని తెలుగు తమ్ముళ్లు వ్యవహరించినా... ఆ పార్టీ ఖాతాలోకి మూడు జడ్పీ పీఠాలు జమ అయ్యాయి.
ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే ...
Published Wed, Jul 23 2014 11:52 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement