'వేరే దేశంలో అయితే బాబును జైల్లో పెట్టేవారు' | Sakshi
Sakshi News home page

'వేరే దేశంలో అయితే బాబును జైల్లో పెట్టేవారు'

Published Mon, Dec 22 2014 1:46 PM

'వేరే దేశంలో అయితే బాబును జైల్లో పెట్టేవారు' - Sakshi

హైదరాబాద్: రైతు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని దారుణంగా మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. వేరే దేశంలో అయితే చంద్రబాబును జైల్లో పెట్టేవారని అన్నారు. ప్రజలు, రైతులు ఎన్నో ఆశలతో ఓటు వేశారని, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వారి ఆశల్ని అడియాశలు చేశారని ఆరోపించారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమని రఘువీరారెడ్డి అన్నారు.
 

Advertisement
Advertisement