ఒంగోలు: చిన్నపాటి గొడవలో తండ్రి జైలుపాలయ్యాడు. తమ ఇలవేల్పు అయిన తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చి మొక్కుకుంటే తండ్రి జైలు నుంచి బయటపడతాడని భావించిన ఆ 13 ఏళ్ల చిన్నారి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రెలైక్కి ముంబయి నుంచి తిరుపతికి వచ్చింది. అక్కడ నుంచి కాలినడకన కొండెక్కి స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రైలులో వెళ్తూ సొమ్మసిల్లి పడిపోయింది.
ముంబయికి చెందిన విజయవిఠల్ కథమ్ పప్పుధాన్యాలు తయారు చేసే కంపెనీలో పనిచేసేవాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన గొడవలో విజయవిఠల్ కథమ్ జైలు పాలయ్యాడు. అతని కుమార్తె అక్షద విజయకథమ్ (13) 8వ తరగతి చదువుతోంది. తన పదేళ్ల వయసులో తండ్రితో కలిసి కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. మళ్లీ ఆస్వామిని వేడుకుంటే తన తండ్రి జైలు నుంచి విడుదలవుతాడ న్న నమ్మకంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నాలుగు రోజుల క్రితం ముంబయి నుంచి రైలులో నుంచి తిరుపతి చేరుకుంది. కాలినడకన వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని కొండపై మూడు రోజులు ఉండి తిరుగు ప్రయాణమైంది.
ఏ రైలు ఎక్కిందో..ఏమోగానీ ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్లో మంగళవారం సాయంత్రం దిగింది. నీరసంగా ప్లాట్ఫాంపై ఉన్న ఆ బాలికను రైల్వే జీఆర్పీ పోలీసులు గుర్తించి ఒంగోలు జీఆర్పీ సీఐ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. బాలికను ఒంగోలు రైల్వేస్టేషన్కు మంగళవారం రాత్రి తీసుకొచ్చారు. బుధవారం బాలల సంక్షేమ మండలి చైర్మన్ ముందు హాజరుపరిచి బాలసదన్లో చేర్పించారు. బాలిక చెప్పిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు.
తండ్రి జైలు నుంచి విడుదల కావాలని...
Published Thu, May 28 2015 10:37 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement