రైతు రుణమాఫీ, ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ లాంటి హామీలను నెరవేర్చడం ఏపీ ప్రభుత్వానికి సులువేమీ కాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలా ఇచ్చారు గానీ, ఆ రాష్ట్రంతో పోటీపడి రైతు రుణమాఫీ, ఉద్యోగుల వేతనాలు లాంటి అంశాల్లో మాట నిలబెట్టుకోలేరని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్తో పోటీపడి హామీలు ఇవ్వొద్దని చాలా అంశాల విషయంలో తాను చంద్రబాబుకు ఇప్పటికే నిర్మొహమాటంగా చాలా సలహాలు, సూచనలు ఇచ్చానన్నారు. మంగళవారం ఇరు రాష్ట్రాల అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పాత మిత్రులు జానారెడ్డి తదితరులను కలుసుకున్న జేసీ కొద్దిసేపు హల్ చల్ చేసి, తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవచ్చు గానీ, కొంతమేర నిధులు రావొచ్చని జేసీ చెప్పారు. అధికారం కోసం ప్రస్తుత రాజకీయనేతలు ఏమైనా చేస్తారని, తాను కూడా అందుకు మినహాయింపు కాదని, అధికారం కోసమే కాంగ్రెస్ ను వీడి టీడీపీలోకి వచ్చి ఎంపీ అయ్యానని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ పనితీరు బాగుందని పేర్కొన్నారు. ఒకరినొకరు తిట్టుకోవడం గ్రామాల్లో సరేగానీ అసెంబ్లీలో మాత్రం బాగోదన్నారు. సభ్యులు ఇలా దిగజారి మాట్లాడతారని తాను ఊహించలేదని జేసీ అన్నారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీలో సభ్యుడిగా లేనందుకు తాను సంతోషిస్తున్నానన్నారు.
బాబూ.. కేసీఆర్తో పోటీ వద్దు: జేసీ
Published Tue, Mar 24 2015 3:12 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement