Breaking News

తెలంగాణలో కరోనా డేంజర్‌ బెల్స్‌..

Published on Wed, 06/22/2022 - 00:35

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. గత రెండు వారాలుగా కేసుల్లో పెరుగుదల కనిపించగా, మంగళవారం మాత్రం ఏకంగా 400 మార్కును దాటాయి. ఒక్కరోజులో 26,704 మందికి కరోనా పరీక్షలు చేయగా, 403 మంది వైరస్‌ బారిన పడ్డట్టు తేలింది. అందులో హైదరాబాద్‌లో 240, రంగారెడ్డి జిల్లాలో 103 మంది ఉన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఏకంగా 1.5 శాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

మూడున్నర నెలల తర్వాత ఇంతటిస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. కాగా, ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7.96 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 145 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7.90 లక్షల మంది కోలుకున్నారు. 2,375 క్రియాశీలక కేసులు ఉన్నాయి. 24 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరారు. అందులో 12 మంది సాధారణ పడకలపై, ఏడుగురు ఆక్సిజన్‌పై, ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

జాగ్రత్తలు తప్పనిసరి..
సీజనల్‌ వ్యాధులు కూడా పెరుగుతుండటంతో జాగ్రత్తలు పాటించాలని, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ వాడటం తప్పనిసరి అని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పదిహేను రోజుల నుంచి దేశంలో, తెలంగాణలో కోవిడ్‌ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయని చెప్పారు. కోవిడ్‌ కేసుల పెరుగుదలలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రెండు డోస్‌ల టీకా వెంటనే తీసుకోవాలని, పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటినవారు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. కోవిడ్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న 20– 50 ఏళ్ల మధ్య వయసువారు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, కేన్సర్, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు కోవిడ్‌కు గురికాకుండా చూసుకోవాలని, వైద్యం కోసం తప్ప ఎలాంటి ప్రయాణాలు చేయొద్దని పేర్కొన్నారు.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)