Breaking News

సీసీఐ నిబంధనల్ని తొలగించాలి!

Published on Tue, 11/18/2025 - 15:06

రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి రైతులు సంక్షోభంలో ఉన్నారు. సేద్యపు ఖర్చులు పెరుగుతూ ఉండటం, న్యాయమైన ధర లభించక పోవటం, ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోవడం, పత్తి దిగుమతులు పెరుగుతూ ఉండటం ఇందుకు కారణాలు. 

తెలంగాణలో ఎకరాకు సగటున 11.74 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా, ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో 4.56 లక్షల హెక్టార్లలో రైతాంగం పత్తి సేద్యం చేశారు. సుమారు 8 లక్షల టన్నుల పత్తి దిగుబడివస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. ఎకరం సేద్యంపై 40 వేలకు పైగా రైతు పెట్టుబడి పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి వంకలూ పెట్టకుండా రైతుల వద్ద ఉన్నపత్తిని పూర్తిగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత సీసీఐ చేపట్టే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. 

సంక్షోభంలో ఉన్న పత్తి రైతుల వద్ద నుంచి పత్తి సేకరణకు చాలా ఆలస్యంగా కొనుగోలుకేంద్రాల ఏర్పాటు ప్రకటన వచ్చింది. రెండు రాష్ట్రాల్లో ఎక రాకు 12 క్వింటాళ్ల  పత్తి కొను గోలు చేస్తానని చెప్పి 7 క్వింటా ళ్లకు తగ్గించారు. పత్తికి 8,110 రూపాయల మద్దతు ధర ఇవ్వాలంటే తేమ 12% మించరాదని నిబంధన పెట్టారు. రైతు సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ముందుగా రైతు సేవా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న తర్వాత,కేంద్రం పెట్టిన ‘కిపాస్‌ కిసాన్‌ స్లాట్‌’లో 24 గంటల ముందు బుక్‌ చేసుకోవాలి. దీనిపై 70% మంది రైతులకు అవగాహన లేదు. సీసీఐ నిబంధనలు రైతుల నుంచి పత్తి కొనుగోళ్లను తగ్గించుకోవటానికే! 

చదవండి : Ande Sri బడిలో చదవలేదు..లోకమే ఆయనకు విశ్వవిద్యాలయం

రెండు రాష్ట్రాల్లో తుపాన్, భారీ వర్షాల వల్ల పత్తికి నష్టం జరిగి ఎకరాకు దిగుబడి 5 నుండి 7 క్వింటాళ్లకుమించి రాదనీ, అందుకే సేకరణ ఎకరాకు 12 నుండి 7 క్వింటాళ్లకు తగ్గించడం జరిగిందనీ సీసీఐ చెప్పటం మోసమే! ఎటువంటి ఆంక్షలూ లేకుండా పత్తి మద్దతు ధరను 10 వేలుగా ప్రకటించాలనీ, పత్తి దిగుమతులపై 30% సుంకం విధించాలనీ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పత్తి కొనుగోలు చేయాలనీ... రైతాంగం ఆందోళన బాట పట్టాలి. 
– బొల్లిముంత సాంబశివరావు
రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)