Breaking News

మేడారం జాతరకు 30 జన్‌ సాధారణ్‌ ప్రత్యేక రైళ్లు

Published on Sun, 02/18/2024 - 04:39

సాక్షి, హైదరాబాద్, కాజీపేట రూరల్‌: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 30 జన్‌ సాధా రణ్‌ ప్రత్యేక రైళ్ల సర్విస్‌లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్‌ మీదుగా సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మేడారం జాతర చేరుకోవడానికి, తిరుగు ప్రయాణానికి అత్యంత సురక్షితమైన వేగవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు ఆయా రూట్‌ల నుంచి నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ వెల్లడించినట్లు అధికారులు వివరించారు. 

ప్రత్యేక రైళ్ల వివరాలు  
► సికింద్రాబాద్‌–వరంగల్, వరంగల్‌–సికింద్రాబాద్‌ మధ్య 10 రైళ్లు, సిర్పూర్‌కాగజ్‌నగర్‌–వరంగల్, వరంగల్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ మధ్య 8 రైళ్లు, నిజామాబాద్‌–వరంగల్, వరంగల్‌–నిజామాబాద్‌ మధ్య 8 రైళ్లు, ఆదిలాబాద్‌–వరంగల్, వరంగల్‌–ఆదిలాబాద్‌ మధ్య 2 రైళ్లు, ఖమ్మం–వరంగల్, వరంగల్‌–ఖమ్మం మధ్య 2 రైళ్లు నడుపుతారు. 

► 21 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్‌–వరంగల్‌ (07014), ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వరంగల్‌–సికింద్రాబాద్‌ (07015) ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు సాయంత్రం 6:20 గంటలకు చేరుతుంది.  
► 21వ తేదీన వరంగల్‌–ఆదిలాబాద్‌ (07023) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ వరంగల్‌లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు ఆదిలాబాద్‌ చేరుతుంది.  

► 22వ తేదీన ఆదిలాబాద్‌–వరంగల్‌ (07024) వెళ్లే ప్రత్యేక రైలు ఆదిలాబాద్‌లో రాత్రి 11:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12:45 గంటలకు వరంగల్‌ చేరుతుంది.  
► 23 తేదీన ఖమ్మం–వరంగల్‌ (07021) వెళ్లే రైలు ఖమ్మంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి వరంగల్‌కు 12:20 గంటలకు చేరుతుంది.  
► 24న వరంగల్‌–ఖమ్మం (07022) వెళ్లే ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55కు బయలుదేరి ఖమ్మంకి సాయంత్రం 4:30 గంటలకు చేరుతుంది. 

భక్తుల సౌకర్యార్ధం రైళ్లు: కిషన్‌రెడ్డి 
మేడారం సమ్మక్క, సారక్క జాతరకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక రైళ్లను వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్లకోసం రూ.3 కోట్లను కేటాయించింది’అని కేంద్ర పర్యా­టక, సాంస్కృతికశాఖల మంత్రి జి.కిషన్‌ రెడ్డి వెల్లడించారు.  ‘నరేంద్రమోదీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధి­తో పనిచేస్తోంది. అందు­లో భాగంగానే.. తెలంగా­ణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సార­క్క జాతర నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ల­ను నడుపుతోంది’’అని ఆయన తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)