Breaking News

రిటైర్డ్‌ ఉద్యోగికి రూ.3.29 కోట్ల టోకరా

Published on Fri, 06/12/2026 - 00:51

సాక్షి, హైదరాబాద్‌: రామ్‌నగర్‌కు చెందిన ఓ రిటైర్డ్‌ ప్రైవేట్‌ ఉద్యోగిని పెట్టుబడుల పేరుతో రూ.3.29 కోట్లకు ముంచిన హేమంత్‌ కుమార్‌పై నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్‌) కేసు నమోదైంది. దొర్నాల రవీందర్‌ వజీర్‌ సుల్తాన్‌ టొబాకో (వీఎస్టీ) కంపెనీ లిమిటెడ్‌లో పనిచేసి పదవీ విరమణ పొందారు. దాదాపు రెండేళ్ల క్రితం అదే ప్రాంతంలో నివసించే రామకాంత్‌ అనే వ్యక్తితో ఈయనకు పరిచయమేర్పడింది. అతని ద్వారా రవీందర్‌ చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు. రామకాంత్‌ ద్వారా ఆయనకు రాజు, మధుసూదన్‌లతో పరిచయం కాగా వీళ్లు హేమంత్‌ కుమార్‌ను పరిచయం చేశారు.

హేమంత్‌ టెలివిజన్లు, మొబైల్‌ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువుల వ్యాపారం చేస్తాడని, అలాగే సమృద్ధి మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి అద్దెకు కార్లు తీసుకుని ట్రావెల్స్‌ వ్యాపారం కూడా నిర్వహిస్తాడని చెప్పారు. తాము ఇప్పటికే అతని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు పొందుతున్నామని, మీరు కూడా పెడితే కనీసం ఐదు నుంచి పది శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు. హేమంత్‌ కుమార్‌ కూడా స్వయంగా పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన లాభాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. వారి మాటలు నమ్మి రవీందర్‌ పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాడు.

గత ఏడాది ఆగస్టు 8న హేమంత్‌ కుమార్‌ స్వయంగా రవీందర్‌ ఇంటికి వెళ్లి ప్రామిసరీ నోటు రాసి, తన కారును ఉంచి రూ.12.5 లక్షలు తీసుకున్నాడు. ఆపై మరికొన్ని దఫాల్లో కలిపి రూ.3,29,48,620 తీసుకున్నారు. తనకు డబ్బు తిరిగి రాకపోవడంతో రవీందర్‌ ఈ విషయాన్ని రామకాంత్‌కు తెలిపారు. ఆయన హేమంత్‌ కుమార్‌ తనను రూ.43,86,584 మేర మోసం చేశారని, రాజు వద్ద రూ.20,18,000, మధుసూదన్‌ వద్ద రూ.15,00,000, అలాగే, సతీష్‌ వద్ద నుంచి రూ.41,98,537, శివ వద్ద నుంచి రూ.13,01,499 తీసుకుని, పెట్టుబడులపై లాభాలు ఇస్తానని చెప్పి వారినీ మోసం చేశాడని తెలిపాడు. దీంతో రవీందర్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా హేమంత్‌పై కేసు నమోదైంది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)