Breaking News

ధరణి అక్రమార్కులను వదలం

Published on Thu, 02/19/2026 - 04:13

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ఆస్తుల రక్షణ కోసం నిర్మించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను గత ప్రభుత్వంలోని పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడు­కున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని­వాస్‌రెడ్డి మండిపడ్డారు. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలను కొల్లగొట్టిన చలాన్ల కుంభకోణంపై జరిగిన ఉన్నత స్థాయి విచారణలో దిగ్భ్రాంతికరమైన విష­యాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభు­త్వ సొమ్మును కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతా­ధికారులను ఆదేశించారు. 

సచివాలయంలోని తన చాంబర్‌లో బుధవారం రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రే­షన్ల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించా­రు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్‌.­లోకేశ్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు, చలాన్ల కుంభకోణంపై నియమించిన కమిటీ సభ్యులు మంద మకరంద్, సింధుశర్మ, సంపత్, సుభాషిణి, శరత్‌కుమార్‌లు పాల్గొ­న్నారు. సమావేశంలో భాగంగా కమిటీ రూపొందించిన నివేదిక, ఇందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొంగులేటి సమీక్షించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కుంభకోణం కేవలం సాంకేతికపరమైన లోపమే కాదని, వ్యవస్థీకృత వైఫల్యమన్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన ఎవ­రినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మాన­వ ప్రమేయంతో తప్పులు చేసేలా ధరణి పోర్టల్‌ను రూపొందించారని ఆరోపించారు. భూముల లావా­దేవీలకు సంబంధించి అనుమానాస్పదమైన భూము­ల సమాచారం లభించకుండా లాగిన్‌లు డిలీట్‌ చేశా­రని తెలిపారు. అత్యంత రహస్యంగా ఉండవలసిన లాగిన్‌ వివరాలు లేకుండా పోయాయని, కోడ్‌ ఆడిట్‌ కూడా నిర్వహించలేదని ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైందని చెప్పారు. 

తక్షణమే ధరణి పోర్టల్‌ లావాదేవీలపై కోడ్‌ఆడిట్‌ నిర్వహించాలని, భూభారతి పోర్టల్‌కు ఎ­లాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఆడిటింగ్‌లు పూ­ర్తిచేసి రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను ఆదే­శించారు. ప్రజల భూముల విషయంలో ఎటువంటి రాజీ పడబోమన్నారు. ధరణి పేరుతో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికి తీస్తామని స్పష్టం చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే మిగిలిన జిల్లాల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహణకు చర్యలు తీసు­కోవాలని కూడా మంత్రి పొంగులేటి ఆదేశించారు.   

Videos

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

గుంటూరు గోపి లాకప్ డెత్..? రాఖీ పండుగ రోజు తీసుకెళ్లి కొట్టి చంపారు..

జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్రకు NCLT షాక్

Photos

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)