amp pages | Sakshi

యాదాద్రిని సంప్రోక్షణ చేయాలి

Published on Sun, 10/30/2022 - 00:50

సాక్షి, హైదరాబాద్‌: ‘రేపిస్టులకే దండలు వేసి ఊరేగించి బయటకు తీసుకువచ్చే వ్యవస్థ బీజేపీకి ఉంది. అలాంటప్పుడు ఆ పార్టీ నేతలు చేసే ప్రమాణాలు, ఇమానాలకు విలువేం ఉంటుంది. వీటితో సమస్యలు పరిష్కారమైతే కోర్టులు, చట్టాలు, పోలీసుస్టేషన్లు అక్కరలేదు. అమిత్‌ షా చెప్పులు మోసిన చేతులతో దేవుడిని తాకడం పాపం. యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని వేద పండితులను కోరుతున్నా..’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. ‘బీజేపీకి ఓటు.. మునుగోడుకు చేటు’శీర్షికతో టీఆర్‌ఎస్‌ రూపొందించిన చార్జిషీట్‌ను శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి కేటీఆర్‌ విడుదల చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో, ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ 21 అంశాలతో ఈ చార్జిషీట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తడిబట్టలతో ప్రమాణం చేయడంపై, ఎమ్మెల్యేలకు ఎర అంశంపై తీవ్రంగా స్పందించారు. 

దేవుడు అపవిత్రం అవుతాడు..: ‘గుజరాత్‌ వాళ్ల చెప్పులు మోసే ఖర్మ బీజేపీ నేతలకు ఉండొచ్చేమో కానీ, వీళ్లు తాకితే దేవుడు మలినం, అపవిత్రం అవుతాడు. యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి పాప ప్రక్షాళన చేయాలని వేద పండితులను, ఆలయ అధికారులను కోరుతున్నా’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

మా మాటలు వక్రీకరించే అవకాశం ఉంది 
‘ఎమ్మెల్యేలకు ఎర అంశంపై మేం మాట్లాడితే విచారణను ప్రభావితం చేస్తున్నారనే విమర్శలకు అవకాశముంటుంది. దురుద్దేశాలు ఆపాదించి మా మాటలను వక్రీకరించే అవకాశముంది. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సరైన సందర్భంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ స్పందిస్తారు. దర్యాప్తు సంస్థలు అన్ని వివరాలు వెల్లడిస్తాయి. అయినా ఇప్పటికే ప్రజల ముందుకు అన్ని విషయాలు వచి్చనందున దొర ఎవరో.. దొంగ ఎవరో అర్ధమైంది. దర్యాప్తును ప్రభావితం చేసేలా నాతో సహా పార్టీ నేతలెవరూ తొందరపాటు ప్రకటనలు చేయరు..’అని మంత్రి చెప్పారు. 

మునుగోడు ఆత్మగౌరవాన్ని బీజేపీ కొనాలనుకుంటోంది.. 
మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ధనబలంతో జూటా, జుమ్లా పార్టీ బీజేపీ కొనుగోలు చేయాలనుకుంటోందని కేటీఆర్‌ విమర్శించారు. అడ్డికి పావుశేరు చొప్పున దేశాన్ని అమ్మేస్తూ బీజేపీ ప్రభుత్వం కాలే కడుపులను మరింత మాడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

8 ఏళ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పు 
► చార్జిషీట్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 67 ఏళ్లలో అందరు ప్రధానులు రూ.55.87 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే ఎనిమిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు అప్పు చేశారు.
► అప్పులపై వడ్డీలు చెల్లించేందుకు దేశ ఆదాయంలో 2014–15లో 36.1 శాతం ఖర్చు చేస్తే, 2021లో వడ్డీ భారం 43.7 శాతానికి పెరిగింది. 
► చేనేత, ఖాదీ ఉత్పత్తులపై దేశంలోనే తొలిసారిగా 5 శాతం జీఎస్టీ విధించిన ఘనత బీజేపీదే.  
► మోటార్లకు మీటర్లు పెట్టడం ద్వారా ఉచిత విద్యుత్‌కు ఉరి వేసింది. 
► కృష్ణా జలాలపై మోదీ ప్రభుత్వం నికృష్ట రాజకీయం చేస్తోంది. 
► గ్యాస్‌ ధర పెంపుతో వంట గదిలో మంట పెట్టింది 
► పెట్రో ధరల పెంపుతో జనం నడ్డివిరుస్తోంది.  
► మునుగోడు ఫ్లోరైడ్‌ గోడును కేంద్రం పట్టించుకోలేదు. 

వీటితో పాటు గిరిజన రిజర్వేషన్ల అమలు, గౌడ కులస్తుల అణిచివేత, బీసీలపై కపట ప్రేమ సంక్షేమ పథకాలు, నిరుద్యోగం, తెలంగాణ విద్యార్థులపై వివక్ష, విభజన చట్టానికి తూట్లు, రైతు వ్యతిరేక విధానాలు, రూపాయి పతనం, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వంటి అంశాలను చార్జిషీట్‌లో పొందుపరిచారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, పార్టీ నేతలు సీతారాం నాయక్, దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)