Breaking News

వారే అసలైన ‘బయ్యారం’ దోషులు.. కేసీఆర్‌, ఆయన కుటుంబంపై కిషన్‌రెడ్డి ధ్వజం 

Published on Sat, 10/01/2022 - 03:26

సాక్షి, న్యూఢిల్లీ: బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే అసలైన దోషులని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు 2014లో అధికారంలోకి రాగానే మోదీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు.

ఆ కమిటీ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఆచరణ సాధ్యం కాదని నివేదిక ఇచ్చిందని.. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే జరిగిందని గుర్తుచేశారు. ఆ నివేదికకే కేంద్రం, బీజేపీ మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2018లో ఓ కమిటీని ఏర్పాటు చేయగా.. కమిటీ కూడా ఆ ఇనుప ఖనిజం నాణ్యమైనది కాదని పేర్కొందన్నారు. అయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందన్నారు.  

దమ్ముంటే సొంతంగా కట్టండి... 
కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘కేంద్రం కట్టకపోతే మేమే బయ్యారం ఫ్యాక్టరీని కడతాం. సింగరేణి, టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలో బయ్యారం ఫ్యాక్టరీని నిర్మిస్తాం. 10 నుంచి 15 వేల మందికి ఉపాధి కల్పిస్తాం’ అంటూ ఇచ్చిన హామీని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల ప్రజలు గుర్తుపెట్టుకున్నారని పేర్కొన్నారు. సీఎం, ఆయన కుటుంబానికి చేతనైతే, దమ్ముంటే బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని కట్టాలని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్‌ చేశా రు.  ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా సీఎం నిలబెట్టుకోలేకపోయారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.  

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)