అమ్మకానికి హెచ్‌ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్‌లైన్‌ వేలం ఎప్పుడంటే?

Published on Mon, 02/20/2023 - 12:03

సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లోని హెచ్‌ఎండీఏ  స్థలాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అందుబాటు ధరల్లో  ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు  చేపట్టారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎమ్మెస్‌టీసీ ఈ  వేలం ప్రక్రియను నిర్వహించనుంది. మధ్యతరగతి ప్రజలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, డెవలపర్లు ఈ ల్యాండ్‌ పార్సిళ్లను కొనుగోలు చేసేందుకు అనుగుణంగా  స్థలాల విస్తీర్ణం ఉన్నట్లు  అధికారులు  తెలిపారు.

ఔటర్‌రింగ్‌ రోడ్డుకు దగ్గరలో  39 ల్యాండ్‌ పార్సిళ్లు  అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10,  మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 6 ప్లాట్‌లు,  సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్‌ పార్సిళ్లు  ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ స్థలాల వివరాలను  కేఎంఎల్‌ ఫైల్‌ ద్వారా చూసుకునే సదుపాయం ఉంది. 121 నుంచి 10,164 గజాల వరకు ఈ స్థలాలు ఉన్నాయి. గండిపేట వద్ద 3 ప్లాట్‌లు, శేరిలింగంపల్లిలో 5, ఇబ్రహీంపట్నంలో 2 ప్లాట్‌లు, అమ్మకానికి ఉన్నాయి. మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో 4, ఘట్కేసర్‌లో 1, బాచుపల్లిలో 1 చొప్పున ఉన్నట్లు  అధికారులు  పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో 16, ఆర్‌సీపురంలో 6 ప్లాట్‌లు, జిన్నారంలో ఒకటి చొప్పున స్థలాలు అమ్మకానికి  సిద్ధంగా ఉన్నాయి. 

ఆన్‌లైన్‌ వేలం..
39 స్థలాలను వచ్చే నెల మార్చి 1న ఎమ్మెస్‌టీసీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్‌ టైటిల్‌ కలిగిన ఈ స్థలాలను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెస్‌టీసీలో నమోదు చేసుకోవాలి.

ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశించిన ఈఎండీ (ధరావత్తు) రుసుమును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 21న  రంగారెడ్డి జిల్లా పరిధిలోని  స్థలాలకు శేరిలింగంపల్లి జోనల్‌ ఆఫీసులో,  22వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని స్థలాలకు  ఆర్‌సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో 23న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా స్థలాలపై ఉప్పల్‌ సర్కిల్‌  ఆఫీసులో ప్రీ బిడ్‌ సమావేశాలను  నిర్వహించనున్నారు.
చదవండి: ధర తక్కువ.. డిమాండ్‌ ఎక్కువ..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి!

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)