Breaking News

డబుల్‌ డెక్కర్‌ ఆగయా.. నిజాం నాటి బస్సులకు పూర్వ వైభవం..

Published on Tue, 02/07/2023 - 20:10

సాక్షి, హైదరాబాద్‌:  ‘అలనాటి చారిత్రక డబుల్‌ డెక్కర్‌ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. హైదరాబాద్‌ అందాలను ఆస్వాదిస్తూ  రెండంతస్తుల బస్సుల్లో  ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి’ అంటూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్‌ ఆ అందమైన అనుభవాన్ని నగరవాసులకు తిరిగి అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే  డబుల్‌ డెక్కర్‌ బస్సులను రోడ్డెక్కించనున్నట్లు  ఆయన అప్పుడే చెప్పారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించినట్లుగానే పర్యావరణ ప్రియమైన ఎలక్ట్రిక్‌  డబుల్‌ డెక్కర్‌ బస్సులను మంగళవారం ప్రారంభించారు.

నగరవాసులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను, సందర్శకులను సైతం విశేషంగా ఆకట్టుకొనే విధంగా ఉన్న మూడు డబుల్‌ డెక్కర్‌  బస్సులను నానక్‌రాంగూడలోని హెచ్‌ఎండీఏ అనుబంధ హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌  కార్యాలయం వద్ద జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఫార్ములా– ఈ ప్రిక్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు  ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఆహ్లాదభరింతంగా పర్యాటక విహారం.. 
ఫార్ములా– ఈ ప్రిక్స్‌ సందర్భంగా  ప్రారంభించిన డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రస్తుతం రేసింగ్‌ ట్రాక్‌ పరిధిలోని ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, పారడైజ్‌ ,నిజాం కాలేజీ రూట్‌లలో తిరుగుతాయి. మొదటి విడతగా హెచ్‌ఎండీఏ 6 బస్సులను కొనుగోలు చేయగా  ప్రస్తుతం మూడింటిని ప్రవేశపెట్టారు. త్వరలో మరో మూడు బస్సులు రానున్నాయి. దశలవారీగా మొత్తం 20 బస్సులను ప్రవేశపెట్టేందుకు హెచ్‌ఎండీఏ  ప్రణాళికలను సిద్ధం చేసింది. ఫార్ములా– ఈ ప్రిక్స్‌ అనంతరం డబుల్‌ డెక్కర్‌ బస్సులను చారిత్రక, వారసత్వ కట్టడాల సర్క్యూట్‌లలో నడుపుతారు. హైదరాబాద్‌ పర్యాటక స్థలాలను ఈ బస్సుల్లో సందర్శించవచ్చు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు. ఈ నెల 11న ఫార్ములా– ఈ పోటీల సందర్భంగా డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. 

ఇదీ నేపథ్యం... 
నిజాం కాలంలోనే ప్రవేశపెట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్సులను ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ 2003 వరకు నడిపింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి  జూపార్కు వరకు, అఫ్జల్‌గంజ్‌ వరకు ఇవి నడిచేవి. సికింద్రాబాద్‌ నుంచి మెహిదీపట్నం వరకు  డబుల్‌ డెక్కర్‌లు ఉండేవి. నగరవాసులతో పాటు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ బస్సులో పయనించేందుకు ఎంతో మక్కువ చూపేవారు. ట్యాంక్‌బండ్‌ మీదుగా  ఇందులో ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి. కాలక్రమంలో బస్సుల నిర్వహణ భారంగా  మారడంతో వీటికి కాలం చెల్లింది. ఫ్లైఓవర్‌ల కారణంగా కూడా బస్సులు నడపడం  కష్టంగా మారింది. మంత్రి కేటీఆర్‌ చొరవ మేరకు ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక సామర్థ్యంతో రూపొందించిన ఎలక్ట్రిక్‌  డబుల్‌ డెక్కర్‌లు అందుబాటులోకి వచ్చాయి.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)