Breaking News

సాగు.. బాగుబాగు

Published on Thu, 01/01/2026 - 05:05

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి పనులు వేగం పుంజుకున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల దిగువన ఉన్న పొలాలతో పాటు చెరువులు, బావుల కింద సాగయ్యే పొలాల్లో నాగళ్లు, ట్రాక్టర్ల సవ్వడులు పెరిగాయి. వరితోపాటు జొన్న, మొక్కజొన్న పంటలను మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆదిశగా దృష్టి సారించారు. పంటల వైవిధ్యంపై ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ, సంప్రదాయ పంటలు, తృణ ధాన్యాల వైపు రైతులు ఆసక్తి చూపడం లేదు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్‌ ఉమ్మడి జిల్లాలతోపాటు మరికొన్ని జిల్లాల్లో రైతులు గతంలో సాగుచేసే శనగ, వేరుశనగ పంటల దిక్కు కూడా చూడటం లేదు. ఈసారి 68.67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో యాసంగి పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే గత సంవత్సరం యాసంగిలో 79.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగైన నేపథ్యంలో ఈసారి కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  

ఇప్పటి వరకు 17.05 లక్షల ఎకరాల్లో 
డిసెంబర్‌ రెండో వారం నుంచి రాష్ట్రంలో దుక్కులు దున్నే కార్యక్రమం మొదలైంది. ఇప్పటివరకు 17.05 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఇది గత సంవత్సరాంతంతో పోలిస్తే 2 లక్షల ఎకరాలు అధికం. అందులో అత్యధికంగా వరి 6.06 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, తరువాత స్థానంలో మొక్కజొన్న 5.76 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రవ్యాప్తంగా 25 శాతం మేర ఇప్పటికే సాగు కాగా, సంక్రాంతి నాటికి 60 శాతానికి చేరుకుంటుందని అంచనా. సంక్రాంతి వరకు ప్రభుత్వం రైతుభరోసా నిధులు కూడా జమ చేస్తుండడంతో ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా వరి 
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఆసిఫాబాద్, మెదక్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లో ఇప్పటివరకు ఎకరం పొలంలో కూడా నాట్లు వేయలేదు. అదే సమయంలో నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 1.67 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు శాఖ తాజా నివేదిక తేటతెల్లం చేస్తుంది. ఇక్కడ అన్ని రకాల పంటలు కలిపి 2.40 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇది మొత్తం పంటల సాగులో 45 శాతం వరకు ఉండటం గమనార్హం. అలాగే నల్లగొండలో 88,372 ఎకరాల్లో సాగైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహబూబ్‌నగర్‌లో 72,553 ఎకరాల్లో వరి సాగవడం విశేషం. కామారెడ్డిలో 47,905 ఎకరాల్లో, రాజన్న సిరిసిల్లలో 46,540, జగిత్యాలలో 35 వేల ఎకరాల్లో వరి సాగైంది. ఈ వారంలో సాగు అన్ని జిల్లాల్లో ఊపందుకుంటుందని అధికారులు చెబుతున్నారు.  

పెరిగిన జొన్న, మొక్కజొన్న 
మొక్కజొన్న, జొన్న పంటలను మార్క్‌ఫెడ్‌ మద్ధతు ధరకు కొంటుండటంతో ఆ పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో యాసంగిలో సంప్రదాయ పంటలుగా పేరొందిన వేరుశనగ, శనగకు ఆదరణ లేకుండా పోయింది. ఈ యాసంగిలో వేరుశనగ సాధారణ సాగు 2.60 లక్షల ఎకరాలుగా పేర్కొంటే, ఇప్పటివరకు 1.43 లక్షల ఎకరాల్లోనే సాగైంది. గత సంవత్సరం చివరి నాటికి సాగైన పంట కన్నా ఇది 60వేల ఎకరాలు తక్కువ. అలాగే శనగ కూడా 50 వేల ఎకరాలు తగ్గింది.  

యూరియా కోసం తప్పని పాట్లు 
యూరియా పుష్కలంగా ఉందని ప్రభుత్వం ఓవైపు చెబుతుండగా, చాలా జిల్లాల్లో యూరియా కోసం రైతు వేదికలు, పీఏసీఎస్‌లు, ఎరువుల దుకాణాల వద్ద రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలకు కేటాయించిన యూరియా పంపిణి సక్రమంగా జరిగేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచే నోడల్‌ అధికారులు రంగంలోకి దిగారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఏ రోజుకారోజు అమ్మకాలు, నిల్వలపై నివేదికలు వచ్చేలా వ్యవసాయ సంచాలకుడు డాక్టర్‌ బి.గోపి ఆదేశాలు ఇచ్చారు.  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)