Breaking News

రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట.. రూ.10,200 కోట్ల రుణాలకు ఓకే

Published on Thu, 07/28/2022 - 01:43

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. గతంలో నిలుపుదల చేసిన రూ.10,200 కోట్ల రుణాలను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్‌ డిస్కం అస్యూరెన్స్‌ యోజన (ఉదయ్‌) పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 2017 జనవరిలో చేరింది. ఈ పథకం కింద రాష్ట్ర డిస్కంలకు సంబంధించిన 75 శాతం రుణాలను టేకోవర్‌ చేసుకోవడానికి సమ్మతి తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం, డిస్కంలతో రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల రుణాలను టేకోవర్‌ చేసుకోకపోవడంతో అప్పట్లో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.75 శాతం డిస్కంల రుణాలకు సరిపడా రూ.10,200 కోట్ల ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా కోత విధించింది. 

ఫలించిన తాజా చర్చలు
తాజాగా సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.రామకృష్ణారావు, రజత్‌కుమార్, ఇతర అధికారుల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిసి నిలిచిపోయిన వివిధ రుణాలకు సంబంధించిన అంశంపై చర్చలు జరిపింది. ఉదయ్‌ రుణాలు టేకో వర్‌ చేసుకోనందుకు గతంలో కోత విధించిన రాష్ట్ర రుణాలకు తిరిగి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 2017–21 మధ్య కాలానికి సంబంధించిన డిస్కంల నష్టాలు రూ.8,925 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్‌ చేసుకుంటూ గత నెలలో ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించింది.

అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి.. ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ నుంచి ఒప్పందాల మేరకు రావాల్సిన రుణాల విడుదలకు సైతం అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గతంలో నిలుపుదల చేసిన రూ.10,200 కోట్ల రుణాలను తీసుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తక్షణమే అనుమతిచ్చారు. ఈ మేరకు లేఖను సైతం అందజేశారు. అయితే ఇటీవల నిలిపివేసిన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ రుణాలపై మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలిసింది. 

కస్టమ్‌ మిల్లింగ్‌ గడువు పొడిగింపు
ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) అవసరాల కోసం కస్టమ్‌ మిల్లింగ్‌ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2021–22లో ఎఫ్‌సీఐకి బకాయిపడిన 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇచ్చేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండేను.. సీఎస్‌ సోమేశ్‌కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ బుధవారం ఢిల్లీలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

బీజేపీపై పోరుకు సీఎం దిశానిర్దేశం!
– ఎంపీలతో కేసీఆర్‌ చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తాజా రాజకీయ పరిణామాలపై పలువురు టీఆర్‌ఎస్‌ ఎంపీలతో బుధవారం చర్చలు జరిపారని తెలిసింది. పార్లమెంట్‌లో జరుగుతున్న ఆందోళనలపై ఆరా తీసిన సీఎం.. ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్న అధికార బీజేపీపై రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఏ విధంగా ఉధృతం చేయాలన్న అంశాలపై దిశానిర్దేశం చేశారని సమాచారం. మరోవైపు రాష్ట్ర ఆర్థిక అంశాలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సహా ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు.

Videos

వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

Miss World 2025: అందం అంటే..!

Ambati: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధ పడుతున్నారు

హైదరాబాద్ మెట్రోరైలు ఛార్జీలు పెంపు

చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం

భారత్‌కు షాక్ మీద షాక్ ఇస్తున్న ట్రంప్

వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్ల పర్వానికి తెరలేపిన పచ్చ నేతలు

జమ్మూలో మళ్లీ మొదలైన ఉగ్రవేట ఉగ్రవాదులను పట్టించిన డ్రోన్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఏపీలో రాక్షస పాలన సాగుతోంది: మాజీ MLA రవీంద్రనాథ్ రెడ్డి

Photos

+5

సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)