Breaking News

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయి..

Published on Tue, 03/10/2026 - 19:50

హైదరాబాద్‌: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ వలలో మరో చేప చిక్కింది. మూసాపేట సర్కిల్-53, కూకట్‌పల్లి జోన్‌లో కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా పని చేస్తున్న ఏవో కె.మురళిని ఆర్ఆర్‌ఆర్‌ రేంజ్ యూనిట్ అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. 

మహిళా పొదుపు సంఘానికి చెందిన మహిళల బృందానికి 20 లక్షల రూపాయల రుణం మంజూరు ప్రక్రియను పూర్తిచేసినందుకు 18,000 రూపాయల లంచాన్ని డిమాండ్‌ చేశాడు కె.మురళి. ఫిర్యాదుదారుల నుంచి ఆ డబ‍్బును తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మురళిని అరెస్ట్ చేసిన అధికారులు, కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

ఏ ప్రభుత్వ ఉద్యోగైనా లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించాలని అవినీతి నిరోధక శాఖ సూచించింది. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. అవినీతి నిరోధక శాఖ తెలంగాణ వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్ (@తెలంగాణ ఏసీబీ) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదుదారు పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతారు.

#

Tags : 1

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు