Breaking News

స్కిల్‌ వర్సిటీ ఏర్పాటుపై ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వండి

Published on Tue, 07/09/2024 - 04:45

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాల నాటికి స్పష్టమైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ప్రతిపాదనలు అందించిన 24 గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలి­పారు. 

హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియాలో ఈ అంశంపై వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి గురువారం చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతోపాటు ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.  

ఉపాధి అవకాశాలే లక్ష్యం 
యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందించేలా నైపుణ్య విశ్వవిద్యాలయం కృషి చేయాల్సిన అవసరముందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఇందుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఐఎస్‌బీ తరహాలో ఒక బోర్డు ఏర్పాటు అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. 

స్కిల్‌ యూనివర్సిటీలో ఉండాల్సిన కోర్సులు, బోధన ప్రణాళికపై సమగ్ర అధ్యయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరికులమ్, కోర్సులకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించాలని తెలిపారు. నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించాలని, కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున, ప్రతీ ఐదు రోజులకోసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు.  

ప్రైవేట్‌ భాగస్వామ్యం అవసరమా..? 
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టగలదా అనే అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులతో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమలశాఖ నోడల్‌ డిపార్ట్‌మెంట్‌గా ఉంటుందని సీఎం తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఐటీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్‌ సెక్రెటరీ అజిత్‌రెడ్డి, విష్ణువర్దన్‌డ్డి, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ చైర్మన్‌ సతీష్‌రెడ్డి, భారత్‌ బయోటెక్‌ హరిప్రసాద్, క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌రెడ్డి, ఐ ల్యాబ్స్‌ శ్రీనిరాజు పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, శ్రీధర్‌బాబు తదితరులు గ్రూపు ఫొటో దిగారు.   

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)