Breaking News

దుమ్మురేపిన జైస్వాల్.. తొలి మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీ!

Published on Sat, 09/10/2022 - 12:26

దులీప్‌ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లోనే ముంబై యువ ఆటగాడు, వెస్ట్ జోన్ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతోన్న తొలి క్వార్టర్‌ ఫైనల్లో యశస్వి జైస్వాల్ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 321 బంతులు ఎదర్కొన్న జైస్వాల్‌.. 18 ఫోర్లు, 6 సిక్సర్లతో 228 పరుగులు సాధించాడు. జైస్వాల్‌ను అభినందిస్తూ.. రాజస్తాన్‌ రాయల్స్‌ ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు జైస్వాల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో అతడితో పాటు టీమిండియా వెటరన్‌ ఆటగాడు, వెస్ట్ జోన్‌ కెప్టెన్‌ ఆజింక్యా రహానే కూడా ద్విశతకం సాధించాడు.

ఈ మ్యాచ్‌లో 207 పరుగులు చేసి రహానే ఆజేయంగా నిలిచాడు. మరో వైపు ఓపెనర్‌ పృథ్వీ షా(113) సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్‌ జోన్‌ రెండు వికెట్లు కోల్పోయి 590 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.


చదవండి: Duleep Trophy 2022: డబుల్‌ సెంచరీతో చెలరేగిన అజింక్య రహానే...

Videos

గిరిజనుల రక్తం తాగుతున్న జనసేన ఎమ్మెల్యే

రోహిత్‌ను నిండా ముంచిన గిల్

సుడిగుండంలో కొట్టుకుపోతారు కూటమికి CPI రామకృష్ణ మాస్ వార్నింగ్

జగన్ ను దెబ్బ తీయాలనే బాబు చిల్లర రాజకీయాలు

భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం

Low Class Politics: దావోస్ లో ఇమేజ్ డ్యామేజ్

బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం

పాలసీల ముసుగులో స్కాములు.. స్కీములు

హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

Sailajanath: లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే

Photos

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)