Breaking News

India Maharashtra International Challenge 2022: ఫైనల్లో రుత్విక శివాని

Published on Sun, 09/18/2022 - 04:30

సాక్షి, హైదరాబాద్‌: ఇండియా మహారాష్ట్ర ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి దూసుకెళ్లింది. నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో రుత్విక శివాని 24–22, 21–17తో ఇషారాణి బారువా (భారత్‌)పై విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో రుత్విక 25–23, 21–16తో మాన్సి సింగ్‌ (భారత్‌)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 18–21, 23–21, 21–9తో తారా షా (భారత్‌)పై, రెండో రౌండ్‌లో 21–14, 21–9తో ప్రణవి (భారత్‌)పై గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో జపాన్‌ ప్లేయర్‌ మిహో కయామతో రుత్విక శివాని తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మిహో కయామ 21–14, 21–15తో తస్నీమ్‌ మీర్‌ (భారత్‌)పై విజయం సాధించింది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కె.మనీషా–షేక్‌ గౌస్‌ (భారత్‌) జోడీ ఫైనల్‌ చేరింది. సెమీఫైనల్లో మనీషా–షేక్‌ గౌస్‌ ద్వయం 21–12, 19–21, 21–17తో బొక్కా నవనీత్‌–ప్రియా కొంజెంగ్‌బమ్‌ (భారత్‌) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో మైస్నమ్‌ మెరాబా (భారత్‌), మిథున్‌ మంజునాథ్‌ (భారత్‌) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో మైస్నమ్‌ మెరాబా 22–20, 21–14తో టాప్‌ సీడ్‌ కిరణ్‌ జార్జి (భారత్‌)పై, మిథున్‌ 22–24, 21–7, 21–18తో రవి (భారత్‌)పై గెలిచారు. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గరగ కృష్ణ ప్రసాద్‌ (భారత్‌) ద్వయం 12–21, 15–21తో చోలెంపన్‌–నాంథకర్న్‌ (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)