ICC ODI Rankings: భారత్‌ను వెనక్కి నెట్టిన పాక్.. !

Published on Tue, 06/14/2022 - 13:37

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌.. టీమిండియాను వెనుక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంది. దీంతో భారత్‌ జట్టు ఐదో స్థానానికి పరిమితమైంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్‌ క్వీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. తద్వారా పాక్‌ ఖాతాలో 4 పాయింట్లు వచ్చి చేరాయి. కాగా పాక్‌ 106 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా 105 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

ఇక 125 పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా.. 124 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో.. 107 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. కాగా త్వరలో టీమిండియా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లలో తలపడనుంది.  దీంతో త్వరలోనే పాకిస్తాన్‌ను వెనుక్కి నెట్టే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్‌ ఆనందం​ మున్నాళ్ల ముచ్చటే అనే చెప్పుకోవాలి.
చదవండి: IND vs SA: 'చాహల్‌ ఫామ్‌ టీమిండియాను ఆందోళనకు గురిచేస్తోంది'

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ