అలా అయితే భారత్‌ను ఓడించడం కష్టమే: మైకేల్‌ వాన్‌

Published on Sat, 06/26/2021 - 17:05

లండన్‌: ఇంగ్లండ్‌ క్రికెటర్లు తమ బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోకపోతే సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. సన్నద్ధలేమికి తోడు రొటేషన్‌ విధానం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాడు. కాగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఐదు టెస్ట్‌ల సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మైకేల్‌ వాన్‌ మాట్లాడుతూ.. ‘‘ ఇంగ్లండ్‌ జట్టుల శ్రీలంకను 2-0 తేడాతో ఓడించింది. పాకిస్తాన్‌ను మట్టికరిపించింది.. గతేడాది వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాపై విజయాలు సాధించింది.

అదే విధంగా ఇండియాకు వెళ్లింది.. అద్భుతమైన ప్రతిభా పాటవాలతో తొలి టెస్టులో గెలుపొందింది. జో రూట్‌ డబుల్‌ సెంచరీ చేశాడు. కానీ మూడు రోజుల తర్వాత రొటేటింగ్‌ పద్ధతి కారణంగా పరిస్థితులు మారిపోయాయి. నిజంగా ఇది చాలా తప్పు. అదే విధంగా.. ఇంగ్లండ్‌ నలుగురు సీమర్లు, ఒకే ఒ​క స్పిన్నర్‌తో ఆడటం సరైన నిర్ణయం కాదు’’ అని గత సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆడిన తీరును విమర్శించాడు.

ఇక ఇటీవల న్యూజిలాండ్‌కు సిరీస్‌ సమర్పించుకోవడం గురించి మాట్లాడుతూ.. ‘‘లార్డ్స్‌లో తొలి టెస్టుకు వారం ముందు నుంచే డ్రైగా ఉంది. అయినా ఒక్క స్పిన్నర్‌ లేడు. ఎడ్జ్‌బాస్టన్‌లో కూడా అంతే. స్పిన్నర్‌ లేకుండానే మైదానంలో దిగారు. తప్పులు పునరావృతం చేశారు’’ అని వాన్‌ చెప్పుకొచ్చాడు. అయితే, ప్రస్తుతం బట్లర్‌, స్టోక్స్‌, వోక్స్‌ ఫాంలోకి వచ్చారని, వాళ్ల రాకతో జట్టు బలం పెరుగుతుందన్న మైకేల్‌ వాన్‌.. బ్యాట్స్‌మెన్‌ గనుక విఫలమైతే భారత్‌ను ఓడించడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

చదవండి: WTC 2021-23: టీమిండియా షెడ్యూల్‌ ఖరారు.. ఇంగ్లండ్‌ సిరీస్‌తో షురూ

Videos

ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు... శ్రీవారి సేవలో సీఎం రేవంత్ సహా ప్రముఖులు

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (చిత్రాలు)

+5

‘శంబల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భద్రాచలం : కన్నుల పండువగా శ్రీ సీతారాముల తెప్పోత్సవం (ఫొటోలు)

+5

ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)