Breaking News

IPL 2024: విశాఖలో మరోసారి ఐపీఎల్‌.. సీఎం జగన్‌ ప్రోత్సాహంతోనే..

Published on Fri, 02/23/2024 - 09:25

విశాఖ స్పోర్ట్స్‌: వైఎస్సార్‌ స్టేడియం మరోసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే నాలుగు జట్లకు హోమ్‌ గ్రౌండ్‌గా నిలిచిన ఈ స్టేడియం ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు హోమ్‌ గ్రౌండ్‌గా నిలవనుంది. ప్రస్తుత 17వ ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనున్న చైన్నె సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ విశాఖ వేదికగా జరగనుంది. మరో 38 రోజుల్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు.

రెండు మ్యాచ్‌లు విశాఖలో...
ప్రస్తుత సీజన్‌లో తొలి విడతలో 21 మ్యాచ్‌లు 10 నగరాల్లో రెండు వారాలపాటు జరగనుండగా అందులో రెండు మ్యాచ్‌లు విశాఖలోనే నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూలు ఖరారు చేసింది. 2019లో గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏకంగా రెండు ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లను విశాఖ సొంతం చేసుకోగా.. మళ్లీ ఇప్పుడు మరో రెండు మ్యాచ్‌లకు అతిథ్యమివ్వనుంది. హోమ్‌ గ్రౌండ్‌గా వైఎస్సార్‌ స్టేడియాన్ని తొలిసారిగా 2012లో డెక్కన్‌ చార్జర్స్‌ ఎంచుకోగా 2015లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఎంచుకుంది. 2016లో ముంబయ్‌ ఇండియన్స్‌, పూణే సూపర్‌ జెయింట్స్‌ జట్లు ఏకంగా మూడేసి మ్యాచ్‌లు ఆడాయి. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 13వ మ్యాచ్‌గా మార్చి 31న చైన్నె సూపర్‌కింగ్స్‌తోనూ, 16వ మ్యాచ్‌గా ఏప్రిల్‌ 3వ తేదీన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.

సీఎం జగన్‌ ప్రోత్సాహంతోనే..
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌బిన్నీ, కార్యదర్శి జైషా, ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ సహకారం.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహం వల్లే విశాఖలో రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌ నిర్వహణకు అవకాశం దక్కిందని ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు శరత్‌చంద్రరెడ్డి, కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రపంచ స్థాయి వసతులను అందించడంతో విశాఖవాసులకు దక్కిన అదృష్టంగా భావించవచ్చని పేర్కొన్నారు. విశాఖలో క్రీడలకు ఎంతగానే ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

విశాఖకు ధోని
ఐపీఎల్‌–2016 సీజన్‌లో విశాఖలో జరిగిన 53వ మ్యాచ్‌లో పూణే సూపర్‌జెయింట్స్‌ జట్టు ఆట చివరి బంతిని ధోనీ బౌండరీ దాటించి నాలుగు వికెట్ల తేడాతో విజయతీరానికి చేర్చాడు. అప్పట్లో సీఎస్‌కే జట్టుకు ఐపీఎల్‌ అనర్హత వేటు పడగా ధోని సూపర్‌జెయింట్స్‌ తరఫున ఆడాడు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ పంజాబ్‌ ఎలెవెన్‌ ఏడు వికెట్లకు 172 పరుగులు చేయగా ధోని సేన భారీ లక్ష్యచేధనలో ఆరు వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయాన్నందుకుంది. 30 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన ధోని 64పరుగులతో ఫినిషర్‌గా నిలిచాడు. మరోసారి ధోని ప్రత్యక్ష ఆటను చూసేందుకు విశాఖ తహతహలాడుతోంది.

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)