Breaking News

భారత ఐపీఎల్‌ ఆటగాళ్లకు విదేశీ అంతర్జాతీయ జట్టులో చోటు

Published on Mon, 04/20/2026 - 12:20

భారత్‌, ఆస్ట్రేలియా దేశాలు తనకు పౌరసత్వం ఆఫర్‌ చేశాయని, వారి దేశాల తరఫున క్రికెట్‌ అవకాశాలు కూడా కల్పిస్తామని ముందుకువచ్చాయని, అయితే తాను వాటిని సున్నితంగా తిరస్కరించారని ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ సంచలన విషయాలను తన పుస్తకం "Rashid Khan: From Streets to Stardom" ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. 

ఈ విషయంపై క్రికెట్‌ సమాజంలో చర్చలు జరుగుతుండగానే, ఐసీసీ అసోసియేట్‌ మెంబర్‌ అయిన యూఏఈ (UAE) పలువురు విదేశీ క్రికెటర్లకు పౌరసత్వం ఇచ్చి చర్చను మరింత విస్తృతం చేసింది.

యూఏఈ తొలిసారి ఐదుగురు విదేశీ క్రికెటర్లకు ఒకేసారి పౌరసత్వం మంజూరు చేయడంతో పాటు తమ జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని కూడా కల్పించి సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో విదేశీ ఆటగాళ్లు యూఏఈ క్రికెట్ జట్టుకు ఆడాలంటే మూడు సంవత్సరాల నివాసం అర్హతగా ఉండేది. తాజాగా ఆ దేశం రూల్స్‌ను సవరించి పౌరసత్వం ఇవ్వడంతో పాటు నేరుగా జాతీయ జట్టులోకి తీసుకొని సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది.

యూఏఈ పౌరసత్వం పొంది, ఆ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లలో ఖుజైమా తన్‌వీర్, అజయ్ కుమార్, అదీబ్ ఉస్మానీతో పాటు ఆకాశ్‌దీప్‌ నాథ్‌, హర్ప్రీత్‌ భాటియా లాంటి ఐపీఎల్‌ ఆటగాళ్లు ఉన్నారు. యూఏఈ జట్టు త్వరలో నేపాల్ పర్యటనకు వెళ్లనుండగా, ఈ ఆటగాళ్లు 17 సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు.

అక్షదీప్ నాథ్ ఐపీఎల్‌ సహా ఉత్తరప్రదేశ్ తరఫున 200కి పైగా మ్యాచ్‌లు ఆడి 6500కి పైగా పరుగులు సాధించాడు. హర్‌ప్రీత్ భాటియా  మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ జట్ల తరఫున భారీ అనుభవం కలిగిన బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు.

మొత్తంగా చూస్తే, ఒకవైపు రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లు దేశం పట్ల నిబద్ధతను చూపుతుండగా, మరోవైపు యూఏఈ వంటి దేశాలు విదేశీ ప్రతిభను ఆకర్షిస్తూ తమ దేశ క్రికెట్‌ను బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ దిశను ప్రభావితం చేసే అవకాశముంది.
 

Videos

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

గుంటూరు గోపి లాకప్ డెత్..? రాఖీ పండుగ రోజు తీసుకెళ్లి కొట్టి చంపారు..

జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్రకు NCLT షాక్

ఆ రిపోర్ట్ తో TDP నేతలకు టెన్షన్

TS: రోగులతో కిటకిటలాడుతున్న దవాఖానాలు

Photos

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)