ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!
Breaking News
‘ఫ్లై91’లోకి బాలాకోట్ హీరో అభినందన్
చట్టం సవరించిన చైనా.. భారత్కు గట్టి హెచ్చరిక!
కొండా సురేఖ ఎపిసోడ్కు నేడు ఎండ్కార్డ్?
ట్రంప్ అన్నాడో లేదో.. మ్యాప్ మార్చేసిన వైట్హౌస్!
ఎల్ నినో పంజా.. ఐఎండీ షాకింగ్ అప్డేట్!
ఇరాన్కు సహకరిస్తే ఊరుకునేది లేదు!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవం
రితిక ‘పసిడి’ పంచ్
Published on Tue, 08/12/2025 - 05:57
బ్యాంకాక్: ఆసియా అండర్–22 బాక్సింగ్ చాంపియన్షిప్ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. చివరిరోజు సోమవారం భారత్కు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు లభించాయి. మహిళల ప్లస్ 80 కేజీల విభాగంలో రితిక భారత్కు పసిడి పతకాన్ని అందించింది.
ఫైనల్లో రితిక 4:1తో అసెల్ తొక్తాసియన్ (కజకిస్తాన్)పై గెలిచింది. ఫైనల్స్లో ఓడిన యాత్రి పటేల్ (57 కేజీలు), ప్రియ (60 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో నీరజ్ (75 కేజీలు), ఇషాన్ కటారియా (ప్లస్ 90 కేజీలు) కూడా రజత పతకాలు సాధించారు. ఫైనల్స్లో బొల్తాయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో నీరజ్... ఖాలిమ్జన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఇషాన్ ఓడిపోయారు.
#
Tags : 1