Breaking News

వెస్టిండీస్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్‌.. కెప్టెన్‌ వీరోచిత పోరాటం వృధా

Published on Wed, 04/09/2025 - 17:58

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్‌-2025 పోటీలు ఇవాళ (ఏప్రిల్‌ 9) మొదలయ్యాయి. ఈ టోర్నీకి పాకిస్తాన్‌ ఆతిథ్యమిస్తుంది. ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగగా.. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై పాకిస్తాన్‌, వెస్టిండీస్‌పై స్కాట్లాండ్‌ విజయాలు సాధించాయి. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 49 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్‌ 44 ఓవర్లలో 179 పరుగలకే కుప్పకూలింది. ఫలితంగా పాక్‌ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రెండో మ్యాచ్‌లో పటిష్టమైన వెస్టిండీస్‌పై స్కాట్లాండ్‌ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ 45 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్‌ కాగా.. వెస్టిండీస్‌ 46.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటై లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ అజేయ శతకంతో (114) వీరోచితంగా పోరాడినప్పటికీ విండీస్‌ గెలవలేకపోయింది. 

అంతకుముందు మాథ్యూస్‌ బౌలింగ్‌లోనూ రాణించింది. 10 ఓవర్లలో 56 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. ఈ ప్రదర్శనకు గానూ మ్యాచ్‌ ఓడిపోయినా మాథ్యూస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. గత వరల్డ్‌కప్‌లో (2022) సెమీస్‌ వరకు చేరిన విండీస్‌ ఈసారి వరల్డ్‌కప్‌కు (2025) నేరుగా అర్హత సాధించలేకపోగా, క్వాలిఫయర్స్‌లోనూ పరాభవాన్ని ఎదుర్కొంది.

కాగా, ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్‌-2025లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్‌కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్‌ సహా బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, థాయ్‌లాండ్‌ పోటీపడుతున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్‌ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.‌

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)