Breaking News

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన్న ఇ‍ద్దరు పాకిస్థానీ బాక్సర్ల అదృశ్యం

Published on Thu, 08/11/2022 - 11:38

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీ బాక్సర్లు అదృశ్యమైన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. క్రీడలు ముగిసాక స్వదేశానికి తిరుగు పయనం అయ్యేందుకు బర్మింగ్‌హామ్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న ఆ ఇద్దరు, అక్కడి నుంచి కనిపించకుండా పోయారంటూ పాకిస్థాన్‌ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ (పీబీఎఫ్‌) వెల్లడించింది. ప్రస్తుతం పీబీఎఫ్.. బర్మింగ్‌హామ్‌ పోలీసుల సహకారంతో ఆ ఇద్దరి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

కొద్దిరోజుల కిందట కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న శ్రీలంకకు చెందిన 10 మంది అథ్లెట్లు కూడా ఇదే తరహాలో అదృశ్యమైన నేపథ్యంలో ఈ మిస్సింగ్‌ కేస్‌ చర్చనీయాంశంగా మారింది. కనిపించకుండా పోయిన బాక్సర్లు సులేమాన్‌ బలోచ్‌, నజీరుల్లా ఖాన్‌లుగా పీబీఎఫ్‌ పేర్కొంది. వీరిలో నజీర్‌ 86-92 కేజీల హెవీవెయిట్‌ విభాగం రౌండ్‌ ఆఫ్‌ 16లో వెనుదిరగగా.. 60-63.5 కేజీల విభాగంలో సులేమాన్‌ రౌండ్‌ ఆఫ్‌ 32లో ఓటమిపాలైనట్లు పీబీఎఫ్‌ పేర్కొంది.

బాక్సర్ల అదృశ్యంపై విచారణ నిమిత్తం పాకిస్థాన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు పీబీఎఫ్‌ ప్రకటించింది. కాగా, ఇదే ఏడాది బుడాపెస్ట్‌ వేదికగా జరిగిన 19వ స్విమ్మింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్షిప్‌ సందర్భంగా ఫైజాన్‌ అక్బర్‌ అనే ఓ పాకిస్థానీ స్విమ్మర్‌ కూడా ఇలానే అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు.
చదవండి:  కామన్వెల్త్‌లో భారత ఫెన్సర్‌కు స్వర్ణం

Videos

మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించిన చైనా

చంద్రబాబు పాలనాపై ఆర్కే రోజా కామెంట్స్

మా వాళ్లు ఎంతమంది పోయారంటే.. పాకిస్తాన్ కీలక ప్రకటన

ఏ క్షణమైనా 'రాజాసాబ్' టీజర్ రిలీజ్!

జగన్ ప్రభంజనం చూసి సోనియా గాంధే భయపడింది.. ఇక బాబెంత!

మా మదర్సాపై బాంబులు పడ్డాయి! పూంచ్ ముస్లింల ఆవేదన..

సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి

ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ

విడదల రజిని ఘటనపై ఎంపీ తనుజా రాణి ఫైర్

వైఎస్ఆర్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధి కల్పనపై అక్రమ కేసు

Photos

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?