Breaking News

అంపైర్‌పైకి బంతిని విసిరిన పాక్‌ ఫీల్డర్‌.. తర్వాత ఏమైందంటే?

Published on Thu, 09/18/2025 - 12:03

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు- మ్యాచ్‌ అధికారులకు అస్సలు పడటం లేదనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియాతో ‘నో-షేక్‌హ్యాండ్‌’ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్న పాక్‌.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE)తో మ్యాచ్‌ సందర్భంగా అనూహ్య రీతిలో ఫీల్డ్‌ అంపైర్‌ను గాయపరిచింది.

ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. పాక్‌ ఫీల్డర్‌ చేసిన పని కారణంగా సదరు అంపైర్‌ నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడటం కనిపించింది. యూఏఈ ఆరో ఇన్నింగ్స్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాక్‌ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐదో నంబర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ పరాశర్‌ (Dhruv Parashar) ఆరో ఓవర్లో సయీమ్‌ ఆయుబ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు.

అంపైర్‌పైకి పాక్‌ ఫీల్డర్‌ త్రో.. బలంగా తాకిన బంతి
ఓవర్‌ ఐదో బంతిని థర్డ్‌మ్యాన్‌ రీజర్‌ దిశగా తరలించిన పరాశర్‌.. సింగిల్‌ కోసం పరుగు తీశాడు. ఇంతలో ఫీల్డర్‌ బంతిని అందుకుని నాన్‌-స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు విసిరాడు. అయితే, నేరుగా అది ఫీల్డ్‌ అంపైర్‌ రుచిర పల్లియాగురుగే (Ruchira Palliyaguruge) తలకు తాకింది. దీంతో నొప్పితో అతడు విలవిల్లాడగా.. సయీమ్‌ ఆయుబ్‌ వచ్చి ఆరా తీశాడు. మిగతా ఆటగాళ్లు కూడా వచ్చి అతడిని పరామర్శించారు.

తర్వాత ఏమైందంటే?
అదే విధంగా పాక్‌ ఫిజియో వచ్చి అంపైర్‌కు కంకషన్‌ టెస్టు చేశాడు. ఈ క్రమంలో రుచిరా (శ్రీలంక) మైదానం వీడగా.. రిజర్వ్‌ అంపైర్‌ గాజీ సోహెల్‌ (బంగ్లాదేశ్‌) అతడి స్థానంలో బాధ్యతలు నిర్వర్తించాడు. 

 

ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదు
కాగా భారత ఆటగాళ్లు ‘షేక్‌ హ్యాండ్‌’ ఇవ్వలేదనే సాకుతో ఆదివారం నుంచి అసహనాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన పాకిస్తాన్‌ జట్టు చివరకు ఏమీ సాధించకుండానే యూఏఈతో మ్యాచ్‌ బరిలోకి దిగింది.

భారత క్రికెటర్లు తమతో  కరచాలనం చేయకుండా మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ నిలువరించారని, ఆయనను ఆసియా కప్‌ రిఫరీ బాధ్యతల నుంచి తప్పించాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చేసిన డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఏమాత్రం పట్టించుకోలేదు. టోర్నీ సంగతి తర్వాత... యూఏఈతో బుధవారం పాక్‌ ఆడిన మ్యాచ్‌కు కూడా పైక్రాఫ్ట్‌నే రిఫరీగా ఎంపిక చేసి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.

‘క్షమాపణ’ చెప్పారంటూ...
ఈ మ్యాచ్‌ తాము ఆడబోమని, టోర్నీనే బహిష్కరిస్తామంటూ పాక్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ముందుగా సందేశాలు వచ్చాయి. అందుకు తగినట్లుగానే నిర్ణీత సమయానికి పాక్‌ ఆటగాళ్లు మైదానానికి బయలుదేరకుండా హోటల్‌లోనే ఉండిపోయారు కూడా. అయితే చివరకు తమకు పైక్రాఫ్ట్‌ ‘క్షమాపణ’ చెప్పారంటూ పాక్‌ ఆటగాళ్లు స్టేడియానికి వచ్చారు.

ఈ క్రమంలో పసికూన యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించిన పాక్‌ జట్టు.. సూపర్‌-4కు అర్హత సాధించింది. తదుపరి.. ఆదివారం నాటి మ్యాచ్‌లో మరోసారి టీమిండియాను ఢీకొట్టనుంది. కాగా గ్రూప్‌-ఎ టేబుల్‌ టాపర్‌గా టీమిండియా ముందుగానే సూపర్‌-4కు చేరగా.. పాక్‌ రెండో స్థానంతో బెర్తును ఖరారు చేసుకుంది. యూఏఈ, ఒమన్‌ ఎలిమినేట్‌ అయ్యాయి.  

చదవండి: Asia Cup 2025: మ‌ళ్లీ భార‌త్-పాక్ మ్యాచ్‌.. ఎప్పుడంటే?
 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)