Breaking News

దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఉమ్రాన్‌ మాలిక్‌, ఆర్ష్‌దీప్‌ సింగ్‌కు నో ఛాన్స్‌..!

Published on Thu, 06/09/2022 - 13:46

ఐపీఎల్‌-2022 ముగిసిన తర్వాత తొలి సారిగా టీమిండియా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడనుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం(జూన్‌9) జరగనుంది. అయితే తొలి టీ20కు ముందే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, వెటరన్‌ స్పిన్నర్‌ కుల్ధీప్‌ యాదవ్‌ గాయం కారణంగా సిరీస్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో తొలి టీ20కు భారత తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు ఆకాష్‌ చోప్రా తొలి టీ20కు భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ను అంచనా వేశాడు. అతడు ఎంపిక చేసిన జట్టులో యువ పేసర్లు ఉమ్రాన్‌ మాలిక్‌, ఆర్షదీప్‌ సింగ్‌కు చోటు దక్కలేదు. ఈ జట్టుకు ఓపెనర్లుగా ఇషాన్‌ కిషన్‌‌, రుతురాజ్ గైక్వాడ్‌లను చోప్రా ఎంచుకున్నాడు.

వరుసగా మూడు నాలుగు స్థానాల్లో వరుసగా శ్రేయస్‌ అయ్యర్‌, హార్ధిక్‌ పాండ్యాకు అతడు చోటిచ్చాడు. ఇక తమ జట్టులో వికెట్‌ కీపర్‌గా కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను ఎంపిక చేశాడు. ఆరో స్థానంలో హుడా లేదా కార్తీక్‌కు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు అతడు తెలిపాడు. ఆల్ రౌండర్ల కోటాలో అక్షర్‌ పటేల్‌కు చోటు ఇచ్చాడు. ఇక తన జట్టులో బౌలర్లగా భువనేశ్వర్‌ కుమార్‌, యుజ్వేంద్ర చాహల్, హర్షల్‌ పటేల్‌,ఆవేష్‌ ఖాన్‌ను ఎంపిక చేశాడు.

ఆకాశ్ చోప్రా టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌:
ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), దీపక్ హుడా/దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్‌,భువనేశ్వర్ కుమార్
చదవండి: Dinesh Karthik: నాడు ‘బెస్ట్‌ ఫినిషర్‌’ ధోని ‘జీరో’.. డీకే సూపర్‌ షో! ఇప్పుడు కూడా

Videos

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

COVID Guidelines: ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్

సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్

Photos

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)