Breaking News

డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌, ఐపీఎల్‌ ఫైనల్‌ అచ్చుగుద్దినట్లు ఒకేలా.. ఇలా ఎలా..!

Published on Mon, 05/27/2024 - 13:02

క్రికెట్‌ గణాంకాలకు సంబంధించిన ఆట కాబట్టి అప్పుడప్పుడు ఒకే రకమైన గణాంకాలను చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే గణాంకాలు మాత్రం క్రికెట్‌ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. ఈ గణాంకాల ముందు యాదృచ్చికం అనే మాట చిన్నబోతుంది. అంతలా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఈ గణాంకాలు.

వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జరిగిన మహిళల ఐపీఎల్‌ (డబ్ల్యూపీఎల్‌).. తాజాగా నిన్న ముగిసిన ఐపీఎల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి 17న జరిగిన డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌ (ఆసీస్‌ కెప్టెన్‌) టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆర్సీబీ సైతం తడబడినా మరో మూడు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరగలిగింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా భారతీయ ప్లేయరైన (టీ20 ఫార్మాట్‌లో భారత కెప్టెన్‌) స్మృతి మంధన నేతృత్వంలో ఆర్సీబీ తొలి సారి టైటిల్‌ కైవసం చేసుకుంది.

ఐపీఎల్‌ 2024 ఫైనల్లోనూ అలాగే..
నిన్న జరిగిన పురుషుల ఐపీఎల్‌ ఫైనల్లోనూ కొన్ని విషయాల్లో అచ్చుగుద్దినట్లు ఇలానే జరగడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ (ఆసీస్‌ కెప్టెన్‌) పాట్‌ కమిన్స్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. 

మహిళల ఐపీఎల్‌లోనూ ఇలాగే ఆసీస్‌ కెప్టెన్‌ (మెగ్‌ లాన్నింగ్‌) టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐపీఎల్‌ ఫైనల్లో కమిన్స్‌ ప్రత్యర్ది భారత ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లోనూ ఆసీస్‌ కెప్డెన్‌ (ఢిల్లీ కెప్టెన్‌) ప్రత్యర్ది భారత ప్లేయరే (మంధన).

ఐపీఎల్‌ 2024 ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ (ఆసీస్‌ కెప్టెన్‌) 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్‌ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లోనూ టాస్‌ గెలిచిన ఢిల్లీ (ఆసీస్‌ కెప్టెన్‌) 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. 

ఐపీఎల్‌ ఫైనల్లో భారత ప్లేయర్‌ అయిన శ్రేయస్‌.. ఆసీస్‌ కెప్టెన్‌ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడగొట్టగా.. డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లోనూ ఆసీస్‌ కెప్టెన్‌ లాన్నింగ్‌ నేతృత్వంలోని ఢిల్లీని భారత ప్లేయర్‌ సారథ్యంలోని ఆర్సీబీ అదే 8 వికెట్ల తేడాతోనే ఓడగొట్టింది. ఇన్ని విషయాల్లో ఈ ఏడాది డబ్ల్యూపీఎల్‌, ఐపీఎల్‌కు పోలికలు ఉండటంతో క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)