Breaking News

‘కబ్జా చేసిన అయ్యన్నపాత్రుడు భూకబ్జాల గురించి మాట్లాడుతున్నాడు’

Published on Sat, 10/29/2022 - 13:49

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడమే చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడికి ఇష్టం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'విశాఖ పరిపాలనా రాజధానిపై టీడీపీ నాయకులు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. వచ్చే నెల 11,12 తేదీల్లో ప్రధాని మోదీ విశాఖలో పర్యటించి సీఎం జగన్‌తో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. దీనిని టీడీపీ నాయకులు సహించలేకపోతున్నారు. ఉత్తరాంద్ర ప్రజల ఓట్లతో గెలిచిన టీడీపీ నాయకులు ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారు. చంద్రబాబు ఆడమన్నట్లు ఆడి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. రుషికొండ ప్రాంతంలో టూరిజం ప్రాజెక్ట్ కడుతుంటే తప్పు ఏంటి?.

పర్యావరణం అనేది కోర్టు పరిధిలో ఉంటుంది. కోర్టు నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొండలపై నిర్మాణాలు చెయ్యలేదా. టీడీపీ నాయకులు ఉత్తరాంద్ర ప్రాంతాన్ని దోచుకున్నారు. ఇరిగేషన్ భూములను కబ్జా చేసిన అయ్యన్నపాత్రుడు భూకబ్జాల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇల్లే కరకట్టను ఆక్రమించి కట్టుకున్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను చెడగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోంది. సీఎం జగన్ గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేకంగా సెబ్ అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలో సీఎం జగన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు' అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్కొన్నారు. 

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)